Anchor Anasuya: స్మాల్ స్క్రీన్ పై తన గ్లామర్ తో, యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ అనసూయ, కొద్ది కాలంలోనే మంచి గుర్తింపును సాధించింది. జబర్దస్త్ షోతో తన పాపులారిటీని పెంచుకొని, తద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. రంగమ్మత్తగా రంగస్థలం సినిమాలో అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దు గుమ్మ, గతేడాది రిలీజ్ అయిన పుష్ప సినిమాలోనూ నెగటివ్ పాత్రలో దాక్షాయణిగా నటించి, పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇన్ని రోజులూ టీవీ షోలకే పరిమితం అయిన అనసూయకు పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇక అదే ఉత్సాహంతో మరికొన్ని సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా పలు షోలతో ఇప్పటికే గ్లామర్ అండ్ బ్యూటీఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్ లో శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మెరిసింది. అందులో భాగంగా కంటెస్టంట్స్ పలు స్కట్స్, డాన్స్ లతో అదరగొట్టినట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా అత్తా కోడళ్ళ రిలేషన్ కి సంబంధించి చేసిన ఓ స్కిట్ కి అనసూయా బాగా కనెక్ట్ అయ్యి, ఎమోషన్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా అనసూయ తన భర్త భరద్వాజ్ గురించి చెప్తూ కన్నీటి పర్యంతమైంది. తాను రోజూ తన భర్తతో ప్రేమలో పడుతూ ఉంటానని, తాను చెప్పడం కాదు గానీ, ఆయన లాంటి హస్బెండ్ ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ ఎమోషనల్ అయ్యింది.
కన్నీళ్లు పెట్టిన అనసూయ…
ఎప్పుడూ నవ్విస్తూ, నవ్వుతూ హంగామా సృష్టించే అనసూయ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడి వాతావరణం అంతా నిశబ్దంగా మారినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా పలు ప్రదర్శనలతో ఈ షో ఈ సారి భారీగానే హిట్ కొట్టేలా నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు ఇటీవలే విడుదల చేసిన ప్రోమో చూస్తేనే తెలిసిపోతుంది.































