హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్రం అధ్యక్షుడు ఉన్న శ్రీనివాస్ మెుదటి నుంచి పార్టీ అబివృద్ధి కృషి చేస్తున్నారు. హుజూరాబాద్లో 16వ తేదీన జరిగే దళిత బంధు ప్రారంభ సమావేశంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన గెల్లు మల్లయ్య 1983, ఆగస్టు 21న లక్ష్మీ దంపతులకు శ్రీనివాస్ యాదవ్ జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెరాసలో చేరి అంచెలు.. అంచెలుగా ఎదిగి పార్టీ విభాగాన్ని అధ్యక్షుడు పనిచేస్తున్నారు.


































