హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లి మరియు గచ్చిబౌలి ప్రాంతాల్లో 13.38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే సరూర్నగర్, శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్ సెస్, యూసఫ్గూడలోనూ భారీ వర్షపాతం నమోదైంది.

దీంతో హిమాయత్సాగర్లోకి వరద ప్రవాహం గణనీయంగా పెరిగి, గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఒక గేటును ఒక అడుగు మేర ఎత్తి, మూసీ నదిలోకి నీటిని విడుదల చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చంద్రావణగుట్ట, అంబర్పేట, మలక్పేట, ముసరాంబాగ్, చాదర్ఘాట్ వంటి ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ప్రజలు 040-21111111 నంబర్కు సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
నగరంలో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి.

































