Featured

దారుణ ఘటన.. పిల్లలను ఆడుకోమని చెప్పి పనికి వెళ్లిన తల్లి.. ఇంటికి వచ్చే సరికి..!

Published

on

ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు ఓ దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఓ రోజు ఇంట్లో పిల్లలను ఉంచి పనికి వెళ్లింది ఆ మహిళ. ఇంటికి వచ్చే సరికి దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రదీ‌ప్‌రావుకు, దుర్గావతి దంపతులు. వారికి ముగ్గురు సంతానం. ముగ్గరు కూడా చిన్న పిల్లలే.

ఉపాధి నిమిత్తం వాళ్లు హైదరాబాద్ కు కొన్నేళ్ల క్రితం వచ్చారు. ప్రదీప్ రావు కుత్బుల్లాపూర్‌ బీహెచ్‌ఈఎల్‌ విస్టాకాలనీలోని శ్రీసాయి నిలయం అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. దుర్గావతి పలు ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ రోజు ఉదయం ప్రదీప్ రావు తన డ్యూటీకి వెళ్లిపోగా.. పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా ఇళ్లల్లో పని చేసేందుకు ఆ మహిళ వెళ్లింది.

ఇంట్లోనే ఆడుకొమ్మని వెళ్లిన మహిళ.. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఘోరం జరిగిపోయింది. బాత్రూంకి వెళ్లి చూడగా.. అందులోని ఓ బకెట్లో రెండేళ్ల కొడుకు పడి ఉన్నాడు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే 108 కి కాల్ చేసి.. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో ..ఆ బాలుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

Advertisement

దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హైదరాబాద్‌ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ‌పరిధిలో చోటుచేసుకుంది.

Advertisement

Trending

Exit mobile version