తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న శ్వేత మహంతి స్థానంలో ఎల్. శర్మన్ను ప్రభుత్వం నియమించింది. ఇక నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా ఉన్న మను చౌదరికి పూర్తి స్థాయి కలెక్టర్గా నియమించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాధ్యతలను మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్కు అదనంగా అప్పగించారు.

ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న శ్వేతా మహంతి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకునేందుకు ప్రభుత్వాన్ని రిలీవ్ కోరగా… ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్కు నూతన కలెక్టర్గా ఎల్. శర్మన్ను నియమించింది. ప్రస్తుతం శర్మన్ నాగర్ కర్నూల్ కలెక్టర్గా ఉన్నారు. ఇప్పడు హైదరాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.































