Major Movie: క్షణం సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న అడవి శేషు ప్రస్తుతం మేజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. 2011 నవంబర్ లో జగిగిన ముంబై దాడుల్లో సందీప్ ఉన్నికృష్ణన్ మరణించాడు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథని శశి కిరణ్ తిక్క తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు అనగా జూన్ 3 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.

కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ ఇప్పుడూ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని ‘జీఏంబీ ఎంటర్ టైన్మెంట్’, ‘ఏ ప్లస్ ఎస్ మూవీస్’ తో కలిసి ‘సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా’ నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని హీరో అడవి శేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబు పాత్ర ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపుతున్నారు. మేజర్ సినిమా ట్రైలర్, టీజర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2011లో నవంబర్ లో ముంబై దాడుల్లో ఎంతో మంది మరణించగా కేవలం సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ మాత్రమే ఎందుకు సినిమా తెస్తున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ సినిమా డైరెక్టర్ శశికిరన్ తిక్క ప్రేక్షకులలో ఉన్న అనుమానాలకు వివరణ ఇచ్చాడు. ఇటీవల ఈ విషయంపై స్పందించిన డైరక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
సందీప్ కుటుంబం బాగా సహకరించారు…
ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉండచ్చు. కానీ ఒక వ్యక్తి మీద కొంతమందికి ఫోకస్ ఉంటుంది. సందీప్ జీవిత కథ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అలా అని మిగిలిన వారు తక్కువ అని అనటంలేదు. మిగిలిన వారిని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యుంటారు. వారి గురించి కూడా ఎవరో ఒకరు సినిమా తీయవచ్చు. కానీ నేను సందీప్ జీవిత కథ సినిమా తీసే సమయంలో వారి కుటుంబం కూడా ఎంతో సహకరించింది.కొన్ని సందర్భాలలో బయోపిక్స్ తీసే సమయంలో సమస్యలు అనుకోవాల్సి వస్తుంది . అంతేకాకుండా సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్ అడివి శేష్ కి బాగా నప్పింది. బయోపిక్ అనేది అందరి ఇష్టంతో సహకారంతో చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా విషయంలో అందరి అభిప్రాయాలు సేకరించి వారి సహకారంతోనే సినిమా తెరకెక్కించాను” అంటూ చెప్పుకొచ్చాడు.































