ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు IMA (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఉత్తరాఖండ్ శాఖ రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. తాజగా అల్లోపతి వైధ్యంపై రాందేవ్ బాబా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కరోనాను నియంత్రించడంలో అల్లోపతి వైద్యం విఫలమైందంటూ అయన వ్యాఖ్యలు చేసారు.

కరోనా నేపధ్యంలో అల్లోపతి వైద్యంపై ఆయన చేసిన ప్రకటనలపై క్షమాపణ కోరుతూ రాబోయే 15 రోజుల్లో వీడియో గానీ, రాతపూర్వకంగా క్షమాపణ చెప్పకపోయినా, రాందేవ్ బాబా రూ. 1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని IMA తమ పరువు నష్టం దావా నోటీసులో పేర్కొంది. మరోవైపు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్కు కూడా ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ లేఖ రాసింది.






























