Imandhi Ramarao : దాసరి గారి బంగారక్క సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీదేవి ఆ తరువాత అగ్ర తారగా ఎదిగింది. ఇక ఒక్క సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోయిన్ అయింది. ఇక సినిమాల్లో ఎంత సక్సెస్ అయిందో వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేక పోయింది. సినిమాల్లో జయప్రద, శ్రీదేవి మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. ఇద్దరు కనీసం ఒక్కసారైనా పలకరింపు కి కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఇక శ్రీ దేవి గారి ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత జీవితంలో ఆమె పడిన ఇబ్బందులను ఇమంది రామారావు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
నెలకు 25 లక్షలు వడ్డీ కట్టేది….

ఇమంది గారు మాట్లాడుతూ శ్రీదేవి దగ్గర కొంతకాలం పనిచేయడం వల్ల తన గురించి కొంత వరకు తెలుసు అంటూ ఆమె గురించి చెప్పారు. ఇక జయప్రధ కంటే శ్రీదేవి చాలా తెలివైందని కానీ బాలీవుడ్ కి వెళ్లి మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంది కానీ అలా జరగలేదు. కెరీర్ పరంగా బాగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగతంగా మాత్రం మోసపోయింది అంటూ చెప్పారు. ఇక తనని కలిసి నపుడు యోగక్షేమాలు మాట్లాడుకున్నాక నేను నెలకు 25 లక్షలు వడ్డీ కడుతున్నాని చెప్పారు శ్రీ దేవి.

తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని నమ్మి బోని కపూర్ ను నిండా మునిగిపోయానని చెప్పారు. ఇక తెలుగు ఇండస్ట్రీ లోనే ఉండి వుంటే బాగుండేది కానీ ఇపుడు తిరిగి మళ్ళీ రాలేను అంటూ చెప్పింది. బోని కపూర్ మొదటి భార్య కడుపుతో ఉన్న నన్ను కొట్టిందని, ఇక ఆమె కొడుకు అర్జున్ కపూర్ కూడా కొట్టేవాడంటూ చెప్పి బాధపడింది. నా ఆస్తి మొత్తం కరిగించేసారు అంటూ చెప్పి భాధపడ్డారు అంటూ ఇమంది గారు శ్రీదేవి గారి గురించి చెప్పారు.






























