Imandi Ramarao : ఆకలితో ఉన్న వ్యక్తికి బిర్యానీ దొరికినట్లు ఆచార్య తో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు గాడ్ ఫాదర్ బిర్యానీలా దొరికిందని చెప్పొచ్చు. మెగాస్టార్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేసి డైరెక్టర్ సక్సెస్ అయినట్లే. చిరుతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక లూసిఫర్ సినిమా తెలుగులో కూడా డబ్ అవడం వల్ల ఆల్రెడీ సినిమా కథ ఏంటి అనేది అందరికీ తెలుసు, అయితే సినిమాలో చిరుని ఎలా చూపించాడు, మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథను డైరెక్టర్ మలిచాడా, ప్రేక్షకులకు నచ్చిందా అన్నదే పాయింట్ ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మెగాఫ్యాన్స్ కి సినిమా పండగ అనే చెప్పాలి. అంతా బాగున్నా సినిమాకు వసూళ్లు లేవు నష్టాల్లో ఉంది అంటూ విశ్లేషించారు ఇమంది రామారావు గారు.

చిరంజీవి ఆశలన్నీ అడియాసలు అయ్యాయి…
ఇమంది గారు మాట్లాడుతూ సినిమా కథను కొత్తగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేయలేదు. కేవలం కథనం కొత్తగా ఉండటం వల్ల కొన్ని వర్గాల ఆడియన్స్ కి సినిమా నచ్చింది కానీ సినిమాలో పెద్దగా కొత్తదనం ఏమి లేదు అంటూ చెప్పారు. సినిమాలో చిరుకి హీరోయిన్ లేకపోవడం, సినిమా మొత్తం సమాజానికి ఏదో చేసేవాడిలా కాకుండా కేవలం తన కుటుంబంలో అమ్మాయి ముఖ్యంగా నయనతార క్యారెక్టర్ చెల్లెలు అపార్థం చేసుకుంది దాన్ని చెరిపేయాలి అన్నట్లుగానే సినిమా మొత్తం సాగుతుంది. చివరికి ఆమెను ముఖ్యమంత్రిని చేస్తాడు ఇందులో పెద్దగా ప్లస్ అయిన అంశాలు కనిపించలేదు.

అందుకే సినిమా అంతగా ఆడలేదు ఇప్పటికీ 30 కోట్ల నష్టాలు సినిమాకు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కథను ఎలా తీయాలనుకున్నారో అలానే తీసుంటే సరిపోయుండేది కానీ చాలా మార్పులు చేశారు. ఇక డైరెక్టర్ సినిమా ప్రతి ఫ్రేమ్ లోనూ జనాలు ఉండేలా చూసుకున్నారు తన డైరెక్షన్ తో ఆకట్టుకున్నా వసూళ్లు మాత్రం రాబట్టలేక పోయాడు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఆచార్య సినిమా తరువాత గాడ్ ఫాదర్ మీద చిరు ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశ పరిచాయి అంటూ చెప్పారు.






























