Connect with us

Featured

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

Published

on

అప్పట్లో కథే హీరో. రచయిత ఓ కథను రాసి దాన్ని నిర్మాతకు చెప్పిన తర్వాత గానీ ఈ కథకు ఏ హీరో అయితే సూటవుతాడు.. ఏ దర్శకుడైతే ఇలాంటి కథను బాగా డీల్ చేస్తాడు అని నిర్ణయాలు తీసుకునేవారు. అప్పటి పెద్ద నిర్మాణ సంస్థలు అయిన ఏవీఎం, వాహిని స్టూడియోస్ ఇలాగే సినిమాలను నిర్మించేవి. ఆ తర్వాత మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు – ఆయన తనయుడు డి సురేశ్ బాబు లాంటి వారు కూడా ముందు కథకే ప్రాధాన్యం ఇచ్చారు..ఇస్తున్నారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి వారు పెద్ద స్టార్ అని నిర్మాతలు సినిమా తీసేవారు కాదు.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!
ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

కానీ ఇప్పుడు చాలా వరకు విధి విధానాలు మారిపోయాయి. నిర్మాత ముందు హీరోను ఒప్పించుకొని డేట్ లాక్ చేసుకుంటున్నారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. ఎప్పటికో ఒకప్పటికి తగ్గ కథ తీసుకొని దర్శకుడు, రచయిత వస్తే దాన్ని ఆ హీరోకు చెప్పి నచ్చితే సినిమా చేస్తున్నారు. అంతేకాదు.. అప్పట్లో కథ అనుకున్నాక.. కాస్టింగ్, లొకేషన్స్ ఫైనల్ చేసుకొని ఓ పరిమిత బడ్జెట్ పెట్టుకునేవారు. దాదాపు అప్పటి నిర్మాతలందరూ చాలా కఠినంగా వ్యవహరించేవారు కాబట్టే అనుకున్న బడ్జెట్‌లో సినిమాలు తీయగలిగారు.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!
ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

కానీ, ఇప్పుడు సినిమాకు అనుకున్న బడ్జెట్ అదుపు తప్పడం చాలా కామన్  అయిపోయింది. ఇన్ని కోట్లు ఖర్చు చేస్తేనే గొప్ప అనే భావన చాలా మందిలో వచ్చేసింది. ఓ హీరో డేట్స్ లాక్ చేసుకున్నాక..అప్పటి వరకు ఆ హీరో చేసిన సినిమాల జోనర్ ఏంటీ.. ఇప్పుడు ఏ కథ అల్లి ఆ హీరోతో సినిమాను చేయాలి అని కథలు రాసుకుంటున్నారు. అందుకే కొన్ని సినిమాల విషయంలో బడ్జెట్ కంట్రోల్ తప్పుతుంది కూడా. ఇప్పుడు హీరో..అతని మార్కెట్‌ను బట్టి సినిమా నిర్మాణం ఉంటోంది.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!
ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

అలాగే భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. ప్రభాస్ హీరో అంటే ఇప్పుడు ఖచ్చితంగా 200 కోట్ల పైనే నిర్మాణ వ్యయం అవుతోంది. ఎందుకు అంటే ఆయన పాన్ ఇండియన్ స్టార్. బాహుబలి తరువాత 100 కోట్ల లోపు నిర్మిస్తున్న ఒక్క సినిమా కూడా ప్రభాస్ చేస్తున్న వాటిలో లేదని అందరికీ తెలిసిందే. ప్రభాస్ మార్కెట్ అండ్ పాన్ ఇండియన్ క్రేజ్ చూసి అందరూ అదే ఫాలో అవుతూ వాటిని రీచ్ అవ్వాలని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ సాధించాలని తాపత్రయపడుతున్నారు.  

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!
ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

ఈ కారణంతోనే పాన్ ఇండియన్ సినిమా అని హీరో ఎవరైనా బడ్జెట్ 200 కోట్ల వరకు పెట్టి పలు భాషలలో రిలీజ్  చేస్తున్నారు. ఇందులో దర్శక, హీరోలకు లాభాలు వస్తే వచ్చే వాటా ఎక్కువే. కానీ ఇలా ఎన్ని సినిమాలు లాభాలు తెచ్చిపెడతాయో గ్యారెంటీ లేదు. ఏమాత్రం కథ ఉండని సినిమాలకు పెద్ద హీరో, భారీ బడ్జెట్ ఖర్చు చేసి నష్ఠాల ఊబిలో కూరుకుపోతున్న నిర్మాతలు ఉన్నారు. పాన్ ఇండియన్ సినిమాను 100 కోట్ల లోపు పూర్తి చేసే దర్శకుడు ఎప్పుడు తయారవుతాడో చెప్పడం కష్ఠమే. అవసరమైతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా చేస్తున్నారు గానీ, ఎక్కడెక్కడ బడ్జెట్ తగ్గించి సినిమా పూర్తి చేయాలి అనే ఆలోచన మాత్రం చాలామంది చేయడం లేదని చెప్పక తప్పదు. 

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!