Connect with us

Featured

పొరపాటున శ్రీను వైట్లకి మహేశ్ ఛాన్స్ ఇచ్చాడంటే వాళ్ళంతా క్యూ కడతారేమో..?

Published

on

సూపర్ స్టార్ మహేశ్..టాలీవుడ్‌లో ఇప్పుడు పేరుకున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే మహేశ్ చేసిన దర్శకులతో సినిమాలు చేయడానికి బాగానే ఆసక్తి చూపిస్తాడు. ఒకసారి తనతో సినిమా చేసి హిట్ ఇస్తే ఆ దర్శకుడికే మళ్ళీ అవకాశం ఇస్తాడు. డీసెంట్ కథలతో మెప్పించడం మాత్రమే కాకుండా మహేశ్ వద్దకి వెళ్ళే సమయానికి బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ పడుండాలి. అప్పుడు దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి పెద్దగా ఆలోచించడు.

అయితే ఇదే పద్దతి ఫాలో అవతుండటం వల్ల కొందరు గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశాలు కూడా కొన్ని సార్లు మిస్ అవుతున్నాడు మహేశ్. తనకి ఆల్‌రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా ఆ తర్వాత ఆ దర్శకుడి ఫ్లాప్స్ వచ్చి కాస్త ఫాంలో లేకపోతే మాత్రం పట్టించుకోడు. ఇదే మాట స్వయంగా మహేశ్‌కి పోకిరి రూపంలో ఒక ఇండస్ట్రీ హిట్ బిజినెస్ మేన్ రూపంలో ఓ భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథే స్వయంగా చెప్పుకొచ్చాడు. అందుకు కారణం ఆయన, మహేశ్‌ని దృష్ఠిలో పెట్టుకొనే జనగణమన అనే కథ రాసుకున్నాడు.

అందరి ముందు కూడా ఈ విషయాన్ని మహేశ్ – నమ్రతలకి చెప్పాడు. ఈ కథలో మహేశ్‌ని తప్ప ఇంకెవరినీ నేను ఊహించుకోలేనని. అయితే జనగణమన కథ మహేశ్‌కి నచ్చలేదనేది ఇంటర్నల్ టాక్. అందుకే ఆ కథను మహేశ్ రిజెక్ట్ చేశాడట. సరే మరో కథ వినడానికి రెడీనా అంటే ఎందుకో అదీ కుదరడం లేదు. పూరి మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకొని ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. కాగా మహేశ్ – దర్శకుడు శ్రీను వైట్ల కలిసి మళ్ళీ సినిమా చేయనున్నారని టాక్ మొదలైంది. అందుకు కారణం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దూకుడు సినిమా.

ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహేశ్‌కి కథ చెప్పేందుకు శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడట. దూకుడు వంటి భారీ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లనే ఆగడు వంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆగడు తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల కోలుకునే హిట్ సినిమా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ నమ్మి మళ్లీ శ్రీను వైట్లకి అవకాశం, ఇస్తే చాలా గొప్పే. ఇదే గనక జరిగితే తనకి ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులంతా మళ్ళీ మీకో భారీ హిట్ ఇస్తామని మహేశ్‌కి కథ చెప్పడానికి రెడీ అవుతారు. మరి మహేశ్ నిజంగానే శ్రీను వైట్లకి ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది కొన్నాళ్ళు ఆగితే గానీ తెలియదు.  

అది జరగాలన్నా ఇంకా చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం మహేశ్, పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత త్రివిక్రం శ్రీనివాస్‌తో ఒక సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డా.కె.ఎల్.నారాయణ నిర్మాతగా ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది. ఇవి పూర్తయ్యాకే శ్రీను వైట్లతో ప్రాజెక్ట్ మూవ్ అవుతుంది.
చూడాలి మరి ఏం జరుగుతుందో.  

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!