సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు. కానీ.., ఈ రంగుల లోకంలో ఎవరి స్థానం అయినా.., సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇలా సూపర్ సక్సెస్ అయ్యి కూడా.. తరువాత కాలంలో సరైన విజయాలను అందుకోలేక.., తెరమరుగు అయిపోయిన స్టార్స్ ఎవ్వరో ఇప్పుడు చూద్దాం.
ఏ ఇండస్ట్రీలో అయినా.., ఒక హీరోకి లవర్ బాయ్ ఇమేజ్ రావడం అంత సులభం కాదు. కానీ.., హీరో తరుణ్ కి అతి తక్కువ కాలంలోనే లవర్ బాయ్ గా మంచి క్రేజ్ దక్కింది.
బాలనటుడిగానే సంచలనాలు సృష్టించిన తరుణ్ పెద్దయ్యాక ‘నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలతో స్టార్ అయిపోయాడు. కానీ.., తరువాత కాలంలో వరుసగా వచ్చిన ఫ్లాప్స్ తరుణ్ కెరీర్ ని దెబ్బ తీశాయి.
ఇక ఈ లిస్ట్ లో తప్పక చెప్పుకోవాల్సిన హీరో వేణు తొట్టెంపూడి. 90 చివరలలో వేణు వరుస విజయాలను అందుకున్నాడు. తరువాత కాలంలో హిట్స్ పడక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు. కానీ.., ఇప్పుడు వేణు చాలా వరకు సినిమాలకి దూరం అయిపోయారు.
చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాతో వరుణ్ స్టార్ అయ్యాడు. కానీ.., తరువాత వరుస పరాజయాలు. మార్కెట్ పడిపోయింది. చివరికి బిగ్ బాస్ లో కూడా మెరిశాడు వరుణ్ సందేశ్. అయినా.., ఇప్పటికీ వరుణ్ కి అవకాశాలు రావడం లేదు.
ఇక బాగా హైలెట్ అయ్యి.., విజయాలను అందుకోలేక పడిపోయిన మరో స్టార్ నవదీప్. చందమామ, గౌతమ్ SSC లాంటి సినిమాలు బాగా ఆడినా ఈ హీరోకి సరైన అవకాశాలు అందలేదు. దీనితో.., ప్రస్తుతం నవదీప్ టీవీ షోలతో బిజీగా ఉన్నాడు.
ఒక్కోసారి ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకున్న స్టార్స్.. ఒక్కసారిగా వెనకపడిపోతుంటారు. అలా ట్రాక్ తప్పిన స్టార్ రాజ్ తరుణ్. హ్యాట్రిక్ సక్సెస్ లతో ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. కట్ చేస్తే ఇప్పుడు ఒక్క హిట్ కూడా రావడం లేదు. చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు.
మీకు హీరో రోహిత్ గుర్తున్నారా? 6 టీన్స్ సినిమాతో 90ల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత రోహిత్ చాలా సినిమాల్లో నటించాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవితో కూడా కలిసి నటించాడు రోహిత్. కానీ.., రోహిత్ ఖాతాలో ఒక్క మాస్ హిట్ కూడా లేదు. దీనితో రోహిత్ పూర్తిగా సినిమాలకి దూరం అయ్యాడు.
చిన్న చిన్న హీరోలు మాత్రమే కాదు .., వడ్డే నవీన్ లాంటి స్టార్ కూడా హిట్ సినిమాలు లేకనే పరిశ్రమకి దూరం అయ్యాడు. అప్పట్లో నవీన్ కి ఉండిన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
బాల నటుడిగా పరిశ్రమలో సూపర్ సక్సెస్ అయ్యాడు తనీష్. తరువాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అయినా.., మంచి అవకాశాలను అయితే అందుకోలేకపోయాడు. చివరికి బిగ్ బాస్ లో మెరిసిన తనీష్ తలరాత మాత్రం మారలేదు.
నటన పరంగా శివ బాలాజీకి అందరూ 100కి 100 శాతం మార్కులు వేశారు. కానీ.., ఆయనకి మాత్రం ఇండస్ట్రీ లాంగ్ రన్ లేకుండా పోయింది. ఆఖరికి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినా శివ బాలాజీకి మళ్ళీ అవకాశాలు రాకపోవడం బాధాకరం.
ఇక ఒకప్పటి స్టార్ హీరో రాజా కూడా ఈ లిస్ట్ లోకే వస్తాడు. ఆయన చేతిలో కొన్ని అవకాశాలు ఉండగానే పరిశ్రమలో ఇబ్బందులను తట్టుకోలేక బయటకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పాస్టర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.