సమంత గురించే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్లో గానీ ఒకటే చర్చలు. అంతగా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నవారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని. దీనికి సరైన సమాధానం మాత్రం అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్య గానీ నోరు తెరిచి చెప్పలేకపోతున్నారు. గత నెలరోజులకి పైగా సమంత, నాగ చైతన్య విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. దానికి నాగ చైతన్య వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోయినా కూడా సమంత వైపు నుంచి మాత్రం హింట్స్ ఇస్తూనే వచ్చింది.
తన సోషల్ మీడియా అకౌంట్స్లో సమంత పెట్టిన పోస్టులతోనే 50 పర్సెంట్ అందరికీ అర్థమైంది. అయితే నాగ చైతన్య నటించిన లవ్ స్టోరి సినిమా రిలీజ్ డేట్ దగ్గర ఉండటంతో విడాకుల విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారట. సినిమా రిలీజయ్యాక అందరూ అనుకుంది వారి పెళ్ళిరోజున అసలు విషయంలో క్లారిటీ వస్తుందని భావించారు. కానీ అంతవరకు ఆగడం ఎందుకులే అనుకున్నారేమో గానీ అక్టోబర్ 2న అందరూ అనుకున్నదే జరిగింది. సమంత, నాగ చైతన్య ఒకే పోస్ట్ను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి విడిపోతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
దాంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. వీళ్ళు విడిపోవడానికి కారణం సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అని ప్రధానంగా వినిపిస్తోంది. అతనితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయ్యాయి. అప్పటి నుంచే సమంత, నాగ చైతన్యల మధ్య విభేధాలు తలెత్తాయని వార్తలు రాస్తున్నారు. అలాగే ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2లో సమంత కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను చైతూ వద్దన్నా చేసిందని మరో మాట వినిపిస్తోంది. ఇక గత కొంతకాలంగా సమంత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని రెండు పెద్ద ఫ్యామిలీస్కి చెందిన అమ్మాయి అయి ఉండి కూడా కొన్ని విషయాలలో హద్దులు మీరుతోందని చెప్పుకున్నారు.
మొత్తానికి కారణాలేమైనా సమంత, నాగ చైతన్య విడిపోయారు. ఇది వాళ్ల కుటుంబ సభ్యులకి మాత్రమే కాకుండా సన్నిహితులకి బాధకలిగిస్తోంది. ఇక సినీ తారలందరు వారికి సపోర్ట్గానే నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు సమంత సినీ కెరీర్ ప్లానింగ్ ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఆమె ఒప్పుకున్న శాకుంతలం పూర్తి చేసింది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి సినిమా చేస్తోంది. తెలుగులో కొత్తగా సైన్ చేసిందేమీ లేదనేది సమాచారం. కొన్ని కమర్షియల్ యాడ్స్ మాత్రం చేస్తూ బిజీగానే ఉందట.
అయితే ఆమె తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ వస్తే ఓకే చెప్పడానికి సిద్దంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. సమంత కోసం మేకర్స్ కూడా రెడీగా ఉన్నారనేది టాక్. కానీ నెమ్మదిగా సమంత సినీ కెరీర్ గ్రాఫ్ పడిపోతుందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. సమంత సినిమాలకి నెగిటివ్ పబ్లిసిటీ ఉంటుందనేది ఇప్పుడు కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ మొదలైతే గానీ ఓ క్లారిటీ రాదు. ఇక సమంత ఓకే చెప్పడానికి రెడీగా ఉన్నా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆమెతో సినిమాలు చేయడానికి మేకర్స్ వస్తారా అంటే క్వశ్చన్ మార్క్ కనిపిస్తోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.