టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఎన్నో సినిమాల్లో నటించిన కానీ, చివరికి సంపాదన మాత్రం లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడిన వారిని మనం చాలా మందినే చూశాం. అయితే కేవలం తెలుగులోనే మాత్రం కాకుండా మిగతా భాషల్లో కూడా వివిధ సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు వేస్తూ పేరు అంతగా లేకపోయినా సంపాదన గడించిన వారు ఎందరో ఉన్నారు కూడా. ఇక అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ స్నేహితుడు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కమెడియన్ సుధాకర్ తమిళ భాషలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా చేసిన వ్యక్తి. ఒకవైపు తమిళంలో హీరోగా నటిస్తూనే మరోవైపు తెలుగులో స్టార్ కమెడియన్ గా ఎదిగారు.
ఇక ఈయన ఫిబ్రవరి 1,1956 సంవత్సరంలో జన్మించారు. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. సుధాకర్ తండ్రిగారు రత్నం. ఈయన ఓ డిప్యూటీ కలెక్టర్. తల్లి పేరు కటాక్షమ్మ. ఈ ఇరువురి దంపతులకు మొత్తం ఏడు మంది మగ సంతానం. ఇందులో సుధాకర్ చివరి వ్యక్తి. తండ్రి ఉద్యోగంలో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం కారణంగా ఆయన తన కుటుంబాన్ని తీసుకోని వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోవెలకుంట్ల లో సుధాకర్ జన్మించారు.
ఆయన బాల్యం మొత్తం కోవెలకుంట్ల, ఆదోని, కోడుమూరు, కర్నూల్, బోధన్, కాకినాడ మొదలగు ప్రాంతాలలో గడిచింది. ఆయన విద్యాభ్యాసం ఎక్కువగా ఏలూరు, గుంటూరు లో జరిగింది. ఇక తను సినిమా మొదటి రోజుల్లో చిరంజీవి, హరి ప్రసాద్, నారాయణరావు లతో కలిసి ఒకే గదిలో నివసించేవారు. అలా మొదట్లో సినిమాల కోసం వేటలో ఉన్న సుధాకర్ కు ఆ సమయంలో దర్శకుడిగా ఉన్న భారతీరాజాను కలవడం తో ఆయనకు కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ అనే సినిమాలో నటించాడు. ఈ అప్పట్లో భారీ సినిమా విజయం సాధించింది.
తమిళంలో స్టార్ హీరో గా కొనసాగిన సుధాకర్ జూన్ 29, 2010 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయారు. ఈయన తెలుగులో సృష్టి రహస్యలు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. సుధాకర్ తెలుగులో ఒక కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సేవలను టాలీవుడ్ కి అందించారు. ఈయన తెలుగులో కొన్ని సినిమాలలో నటనకు ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన చిరంజీవి కంటే ముందుగా హీరోగా తమిళంలో సినిమా చేశారు.
ఇక ఈయనతో తమిళంలో హీరోయిన్ అయిన రాధిక తో కలిసి 18 సినిమాల్లో నటించారు. అంతే కాకుండా తమిళంలో మొత్తం 45 సినిమాల వరకు ఈయన నటించారు. వీరి స్నేహితులైన చిరంజీవి, హరి ప్రసాద్ ల కంటే ఈయన చాలా ముందు ఉండేవారు. అయితే తమిళ ఇండస్ట్రీ, రాజకీయాల్లో వచ్చిన మార్పుల కారణాల వల్ల ఆయన తమిళంలో సినిమాలు చేయడం మానేశారు. ఆ తర్వాత కేవలం టాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యారు. ఇక టాలీవుడ్ లో ఆయన విలన్ క్యారెక్టర్స్, అలాగే కమెడియన్ గా స్థిరపడిపోయారు. అంతే కాదు ఆయన కొన్ని చిత్రాలను కూడా నిర్మించాడు.
అందులో మొదటగా చిరంజీవితో కలిసి యముడికి మొగుడు సినిమా ను కూడా నిర్మించాడు. సుధాకర్ తో పాటు వారి స్నేహితులు కూడా కలిసి ఆ సినిమాను నిర్మించారు. వీటితోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. ఇక పెద్దరికం లాంటి కొన్ని సినిమాలలో సుధాకర్ నటన ను బయటకు తీసుకువచ్చాయి. శుభాకాంక్షలు,స్నేహితులు వంటి సినిమాలకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డులు గెలుచుకున్నారు.
అయితే 2010 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లిన ఆయన 2015 సంవత్సరంలో తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత కూడా తాను సినిమాల్లో నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. అయితే తాను నటన జీవితంలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా వివిధ రూల్స్ పోషించిన ఆయన ఆస్తులను అప్పట్లో బాగానే కూడబెట్టారని టాలీవుడ్ టాక్. ఆయన ఆస్తులు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయని చాలామంది చెప్పేవారు. ఆయన మిత్రుడు నారాయణ రావు కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. సుధాకర్ కోమలో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి అన్ని విధాల తన స్నేహితులు నారాయణరావు, చిరంజీవి లు సహాయం చేశారు.
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.
Advertisement
కార్తీకదీపం డాక్టర్ బాబు.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.
ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.
Advertisement
సీతాఫలం.. అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.