సినిమా మూకీ నుంచి టాకీ వరకు ఎప్పుడూ మూస ధోరణిలో కాకుండా సినీ గమనంలో కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది.ఆ క్రమంలో వచ్చిన చిత్రాలు పాతాళ బైరవి, మిస్సమ్మ, దేవదాసు, శంకరాభరణం, న్యాయం కావాలి, రాణికాసుల రంగమ్మ, ప్రతిఘటన, నిరీక్షణ, సిరివెన్నెల, లేడీస్ టైలర్, పుష్పకవిమానం, విచిత్ర సోదరులు, మట్టిమనుషులు, మాభూమి, కళ్ళు, దాసి లాంటివి సినిమాని మూస ధోరణిలోకి వెళ్ళకుండా చేశాయి. సరిగ్గా అలాంటి కోవలోకి వచ్చే చిత్రమే ‘మూడుముళ్ల బంధం’.
రాముడు రంగడు సినిమా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్న పొన్నతోట రఘురాం ఒకరోజు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ముత్యాల సుబ్బయ్యతో.. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు అయింది. ఏదైనా సొంతంగా సినిమా చేయాలని ఉందనడంతో ముత్యాల సుబ్బయ్య తను రాసుకున్న కథలో నుంచి రెండు లైన్లు చెప్పారు. ఇదివరకు వచ్చిన సినిమా కథలకు భిన్నంగా ఉండటంతో రఘురాంకు బాగా నచ్చింది. చేస్తే ఇలాంటి కొత్త సినిమా చేయాలనుకుని వయసు రీత్యా హీరో, హీరోయిన్స్ మధ్య పది సంవత్సరాలు తేడా ఉండడంతో ముందుగా ఆ పాత్రలకు బాలకృష్ణ, వాణిశ్రీని అనుకున్నారు.
ఎందుకనో అది కుదరకపోవడంతో రాజేంద్ర ప్రసాద్, మాధవిని తీసుకున్నారు. సినిమా షూటింగ్ మొత్తం రాజమండ్రి దగ్గర దాదాపు ఇరవై రోజుల్లో చిత్రీకరించారు. ఇక ఈ సినిమా కథలోకి వెళితే హీరోయిన్ పెళ్లి పీటల పై ఉండగానే పెళ్ళికొడుకు చనిపోతాడు. అందరు హీరోయిన్ ని సూటిపోటి మాటలతో నిందిస్తారు. ఇదంతా గమనిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ఈ అమ్మాయిని అందరూ తిడుతున్నారని.. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిళ్లు ఎన్ని చేయలేదని పెళ్లి పీటల పై ఉన్న హీరోయిన్ మెడలో తాళి కడతాడు. అక్కడ పెళ్లి పందిట్లో ఉన్న పెద్దలంతా అవాక్కవుతారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. చివరికి ఆ హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడన్నదే సినిమా కథ.
సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళింది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన సెన్సార్ సభ్యులు మూడు గంటల వరకు బయటకు రాలేదు… 8 ఏళ్ల బాలుడు, 18 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి ‘శారదా చట్టం’ ప్రకారం బాల్య వివాహాలు నేరమని చెప్పారు. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు అయినప్పుడు ఇది బాల్య వివాహం ఎలా అవుతుందని, మా ఉద్దేశ్యం బాల్యవివాహాలను ప్రోత్సహించడం కాదని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సెన్సార్ సభ్యులతో వాదించారు.
దాదాపు మూడు నెలలు సెన్సార్ సభ్యులతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య పోరాడారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి సినిమా 1980 డిసెంబర్ 6న మూడుముళ్ల బంధం సినిమా విడుదలైంది. యాంటీ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు. ముత్యాల సుబ్బయ్య తన మొదటి ప్రయత్నాన్ని క్రిటికల్ సబ్జెక్టుని ఎన్నుకోవడం సినీ ప్రముఖులకు నచ్చింది. తీసిన విధానం బాగున్నప్పటికీ ప్రేక్షకులు ఎందుకో సినిమాని ఆదరించ లేకపోయారు. కానీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య పై విమర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.