Connect with us

Featured

ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విజయ్ ఆంటోనీ జీవితంలో ఎన్ని విషాదాలు ఉన్నాయో తెలుసా?

Published

on

విజయ్ ఆంటోనీ… ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయి జీవించడానికే అష్టకష్టాలు పడ్డ విజయ్ సినిమా ప్రపంచం లో అడుగుపెట్టి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈయన మొదటగా సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాతగా సినీ ఇండస్ట్రీ లో పని చేసారు. అతను తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నాడు. అతను 2005 లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేసాడు. ఇక ఈయన జీవిత నేపథ్యం చూస్తే…

తమిళనాడు లోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ ‌కోయిల్ ‌లో 1975 జూలై 24న జన్మించాడు. అతని తండ్రి మరణించేనాటికి అతని వయస్సు 7 సంవత్సరాలు అయితే, అతని సోదరి వయస్సు 4 సంవత్సరాలు. దింతో అతని కుటుంబం కష్టాలకు గురి అయింది. అతని తల్లి పిల్లలకు విద్యను అందించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసేది. ఇక విజయ్ ఆంటోనీ లయోలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా విద్యనభ్యసించాడు.

ఇకపోతే విజయ్ ఆంటోని చిన్నప్పటి నుంచే అనేక కష్టాలు ఎదుర్కొని తన నటనా నైపుణ్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా, ఎవరి సినీ కుటుంబ నేపథ్యం ఉన్న ఇళ్లలో పుట్టకపోయినా… సినిమాల్లోకి అడుగు పెట్టాడు. చిన్నప్పుడే తన తండ్రి మరణించడంతో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇకపోతే అతను తన అమ్మని, తల్లిని చెల్లిని కలుసుకోవడానికి వారంలో ఒకసారి మాత్రమే అవకాశం ఉండేదని, అందుకు గల కారణం వారికి అద్దె ఇంట్లో దొరక్కపోవడం. ఇక తన తల్లి ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో విజయ్ ఆంటోని చదువుతున్న సమయంలో తన తల్లికి వేరే ఊరు ట్రాన్సఫర్ అయినా సరే… తన పిల్లల చదువు మానిపించడం ఇష్టం లేక ఉన్నచోటి నుండి ప్రతిరోజు చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉద్యోగాన్ని చేశారు.

అలాంటి సమయంలో తన తల్లికి 15 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే ఆ శిక్షణ తరగతులను హాజరయ్యేందుకు తన తల్లి తనని హాస్టల్లో ఉంచి చదివిందని, చెల్లిని మాత్రం తనతో తీసుకు వెళ్లిందని తెలిపాడు. అయితే అనుకోకుండా తన తల్లి హాస్టల్ లో వదిలి వెళ్ళిన తర్వాత రెండు రోజులకు హాస్టల్ కు సెలవు ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని అతను, ఆ హాస్టల్ వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థులు ఉండే శిబిరంలో తాను కూడా తలదాచుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో విజయ్ ఆంటోని కి చిల్లిగవ్వ కూడా చేతిలో లేకపోవడంతో, దీంతో ఆయన ఆ సమయంలో కేవలం అరటి పండ్లు తింటూ జీవనాన్ని కొనసాగించారు.

అప్పుడు అంతా కష్టపడి తన జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రస్తుతం హీరోగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత తన తొలి చిత్రం 2012 లో “నాన్” అయినప్పటికీ, అతను సలీం (2014), పిచైకరన్ (2016), సైతాన్ (2017), యమన్ (2017), కొలైగరన్ (2019) వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో తన పాత్రలను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

అంతేకాదు ఉత్తమ సంగీత విభాగంలో “నాక ముక్క” అనే సినిమా ప్రకటనల పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు విజయ్. ఈ పాట ద్వారా అతను బాగా గుర్తింపు పొందాడు. ఇక విజయ్ ఆంటోనీ వివాహం సైతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే ఒక యువతీ విజయ్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సందర్భం లో ఆమెతో ప్రేమలో పడి 2006 లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి లారా అని ఒక కూతురు కూడా ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pitapuram: అందరి ఆసక్తి పిఠాపురం పైనే.. గెలుపు ఎవరిది.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

Published

on

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.

గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Advertisement

జనసేనదే విజయమా..
ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!