ఆ మధ్య కాలంలో ఈటీవీ లో ప్రసారమయ్యే స్వరాభిషేకం కార్యక్రమానికి కళా దర్శకులు బాపు,బాలచందర్, విశ్వనాధ్ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం బాలసుబ్రహ్మణ్యం వేదికపైకి ఆ దర్శకత్రయాన్ని ఆహ్వానించి వినమ్రంగా సాష్టాంగ నమస్కారం చేసి.. తన సంస్కారాన్ని పదింతలు పెంచుకున్నారు. నిజంగా ఆ కళా దర్శకులకు అంతటి గౌరవాన్ని ఆపాదించి, ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు. నిజంగా ఈ అగ్ర దర్శకులు వారి చిత్రాలు సమాజంలోని ఆదర్శ సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచాయి. ఆ సంగీత సంప్రదాయాల చిత్రాలు భారత సాంస్కృతిక కీర్తి బావుటాను ఎగురవేశాయి.
నిజంగా వారి దర్శకత్వంలో నటిస్తే ఆ నటుల సినీప్రయాణంలో ఆ చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అదృష్టం సినీ పరిశ్రమలో కొందరికి మాత్రమే దక్కుతుంది. ఎన్టీ రామారావు.. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘నిండు హృదయాలు’ చిత్రంలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు.. విశ్వనాధ్ దర్శకత్వంలో ఆత్మగౌరవం, సూత్రధారులు చిత్రంలో నటించారు. కృష్ణ.. విశ్వనాధ్ దర్శకత్వంలో ‘నేరంశిక్ష ‘చిత్రంలో నటించారు. ఎన్టీ రామారావు.. బాపు దర్శకత్వంలో ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ చిత్రంలో నటించగా, ఏఎన్ఆర్ బుద్ధిమంతుడు, అందాల రాముడు, కృష్ణ ‘సాక్షి’ చిత్రంలో నటించారు.
ఈ ముగ్గురు మరో కళా దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ బాపు, బాలచందర్, విశ్వనాథ్ వంటి కళా దర్శకుల చిత్రాలలో నటించే అరుదైన అవకాశం ఆ తరువాత వచ్చిన చిరంజీవి సొంతం చేసుకున్నారు. బాపు దర్శకత్వంలో “మన ఊరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు చిత్రంలో చిరంజీవి నటించారు.
బాలచందర్ దర్శకత్వంలో ఇది కథ కాదు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, 47 రోజులు, రుద్రవీణ చిత్రంలో చిరంజీవి నటించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలలో చిరంజీవి నటించారు. చిరంజీవి తొలిరోజుల్లో బాపు గారి దర్శకత్వంలో తొలి విజయవంతమైన చిత్రాన్ని మన ఊరి పాండవులు ద్వారా అందుకున్నారు.
అలాగే విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి, ఆపద్బాంధవుడు చిత్రాల్లో నటించి ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ శుభలేఖ చిత్రం విజయవంతంగా నిలిచింది. బాలచందర్ దర్శకత్వంలో చేసిన రుద్రవీణ చిత్రం మిగతా చిత్రాలకంటే ఉత్తమ నటునిగా పేరు తెచ్చినప్పటికీ.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం విజయవంతంగా నిలిచింది. చిరంజీవి ద్విశత చిత్రాల వైపు తన సినీ ప్రయాణంలో ఈ కళా దర్శకుల ఆణిముత్యాలైన.. మన ఊరి పాండవులు,ఇది కథ కాదు, 47 రోజులు, మంత్రి గారి వియ్యంకుడు, ఆడవాళ్లు మీకు జోహార్లు, శుభలేఖ, రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి చిత్రాలు చిరంజీవి అభినయానికి సోపానాలుగా నిలిచాయి.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.