Connect with us

Featured

డాక్టర్ కావాల్సిన వేరోనికా ఎలా మంచు వారింటికి పెద్ద కోడలయ్యింది.

Published

on

మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణును పెళ్లి చేసుకున్న వేరోనికా బ్యాక్ గ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. వెరోనికా సాక్షాత్తు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సోదరి అవుతుంది. వైఎస్ రాజారెడ్డి కుటుంభంలో చిన్నమనవరాలు. వైఎస్ రాజ రెడ్డి నాలుగో కుమారుడు సుధాకర్ రెడ్డి కుమార్తె అన్నమాట. అంటే స్వయానా రాజశేఖర్ రెడ్డికి వెరోనికా కూతురు వరస అవుతుంది. వెరోనికా తల్లి విద్యా రెడ్డి. తల్లి తండ్రులు ఇద్దరు కూడా వ్యాపారవేత్తలు. వెరోనికా అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నది. ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది. డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కూడా కనేది. పాఠశాలలో ఉన్నప్పుడు అమెరికా లోని ఒక ఆసుపత్రిలో వాలంటీర్ గా సేవలు చేయడం కోసం తన స్నేహితులతో కలిసి వెళ్లిన విరోనికా అక్కడ శవాలను చూసి తట్టుకోలేక పోయింది. అందుకే డాక్టర్ కావాలనుకున్న ఆశయాన్ని అప్పుడే వదిలేసింది.

సెలవులకు తాత సిసి రెడ్డీతో గడిపేందుకు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేదట. తాతతో తన ఆశలు, ఆశయాలు సిసిరెడ్డి కి చెప్పి ఆయన సలహాలు, అనుభవం నేర్పిన పాఠాలు నేర్చుకునేదట. సిసి రెడ్డి తనలో ఎంతో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపాడానీ ఆమె తన సన్నిహితులతో చెబుతోందట. తాత చనిపోయినప్పుడు ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఆమెకున్న అనుబంధం అలాంటిది. పెదనాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా వెరోనిక ను తన కూతురు షర్మిల లాగే ఆదరించేవారట. వెరోనికా తన చేయబోయే పనుల గూర్చి చెబుతుంటే ఆయన ఎంతో ఆసక్తిగా సలహాలు కూడా ఇచ్చేవారట. అలాగే వెరోనికాకు తండ్రి తరుపున రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉంటే, అమ్మ తరుపున సినీ వ్యాపార బ్యాక్ గ్రౌండ్ ఉంది. రాజకీయ నేపథ్యంలో నుంచి వచ్చిన వెరోనికా సినీ నేపథ్యం నుంచి వచ్చిన మంచు వారి అబ్బాయి మంచు విష్ణుని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మంచు విష్ణు నటించిన ఢీ సినిమాకు వెరోనికా కాస్టూమ్ డిజైనర్ గా పని చేసింది. ఈ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. హీరో విష్ణు మాట తీరు, నడవడికలు, మంచితనం చూసి ఆమె ఇష్టపడిందట. అలాగే వెరోనికా మంచితనాన్ని చూసి కూడా మంచు విష్ణు మనసు పారేసుకున్నాడట. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా మంచు విష్ణు ఫ్యామిలీ చాలా మంచిదని వెంటనే పెళ్ళికి అంగీకరించారట.

వైస్సార్ ఫ్యామిలీ తో పెళ్లి ప్రస్తావన రాగానే మోహన్ బాబు కూడా కాదనలేకపోయాడు. అందులోను కొడుకు ఇష్టపడిన అమ్మాయి అవ్వడంతో మోహన్ బాబు కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయాడు. అలా అతిరథ మహారథుల సమక్షంలో మంచు విష్ణు, వెరోనికా పెళ్లి అట్టహాసంగా జరిగింది హీరో మంచు విష్ణు వివాహం వెరోనికా రెడ్డితో మార్చి 1, 2009న జరిగిన విషయం తెలిసిందే. ఆ పెళ్ళికి తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు అంతా వచ్చారు. అందరికీ తలలో నాలుకలా మారిపోయిన వెరోనికా ప్రస్తుతం న్యూయార్క్ స్కూల్ నిర్వహిస్తోంది మంచు ఫ్యామిలీ ఇప్పటికే శ్రీ విద్యానికేతన్ పేరుతో స్కూల్స్, కాలేజెస్ స్థాపించారు. మంచు విష్ణు, ఆయన సోదరుడు కూడా అక్కడే చదువుకున్నారు. ఆయనప్పటికీ వెరోనికా మరొక స్కూల్ ను స్థాపించినది. అమెరికాలో తను చదువుకున్న విద్యను తెలుగు ఇక్కడి విద్యార్థులు కూడా చదువుకోవాలన్నా ఉద్దేశంతో ఈ పాఠశాల పెట్టిందట.

మంచు విష్ణు వెరోనికాల జంటకు ఇద్దరు కవల పిల్లలు. వీరు డిసెంబర్ 2011 లో జన్మించారు. వారి పేరు అరియనా, విరియానా. ఇలా ఇద్దరి పిల్లలకు జన్మ నివ్వడంతో విష్ణు ఆ సమయంలో చాలా భావోద్వేగానికి గురయ్యాడట. వెరోనికాతో గడిపిన ప్రతి క్షణం నాకు ప్రత్యేకమే. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిన రోజు మాత్రం నా జీవితంలో మరిచిపోలేనిది అని తెలిపారు. అయితే భర్త ప్రోత్సహంతోనే అటు కుటుంబపరంగా, ఇటు వ్యాపారపరంగా ముందుకు వెళ్లగలుగుతున్నా అని అంటుంది వెరోనికా. అయితే గతంలో ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కాగా, మళ్ళీ వీరికి ఒక బాబు అలాగే మరొక పాప కూడా పుట్టారు. అంటే విష్ణు, వెరోనికా దంపతులకు మొత్తంగా నలుగురు సంతానం అన్నమాట.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!