1980 దశకంలో ఊర్వశి తన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రంభ, ఊర్వశి, మేనక లాంటి చూడచక్కని రూపం. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నాటకరంగంలో పేరు పొందిన VP నాయర్, విజయలక్ష్మిలకు 1971, జనవరి 25న ఊర్వశి జన్మించారు. ఆమెకు కళారంజని, కల్పన అనే ఇద్దరు అక్కయ్యలు కూడా ఉన్నారు. అలాగే కమల్ రాయ్, నందు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆమె తిరువనంతపురంలో లో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో కుటుంబంతో సహా చెన్నైకి షిఫ్ట్ కావడం జరిగింది. ఊర్వశి తన ఎనిమిది సంవత్సరాల వయసులోనే బాలనటిగా సినిమాల్లో అవకాశం రావడం జరిగింది.

ఊర్వశి బాలనటిగా 1977లో విడరున్న మొటుకల్ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 13 సంవత్సరాల వయసులో “తొడురమ్ ఉరవ్” అనే చిత్రంలో కార్తీక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఊర్వశి సినిమాల్లో బిజీగా ఉండడంతో చదువు మధ్యలోనే ఆపేసింది. ఆమె నటించిన మూడు మలయాళ చిత్రాలు పర్ఫామెన్స్ ఆధారంగా భాగ్యరాజా “ముంథనైముచి” అనే చిత్రంలో బుక్ చేసుకోవడం జరిగింది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఊర్వశికి మరిన్ని అవకాశాలు వచ్చాయి.

తెలుగులో(1984) మొదటిసారిగా రుస్తుం చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత అమ్మాయిలు ప్రేమించండి, కాలరుద్రుడు, ఉద్దండుడు, జీవన పోరాటం, అంతిమ తీర్పు, చెట్టు కింద ప్లీడర్, సైజ్ జీరో, చక్రం, సర్దార్ గబ్బర్ సింగ్, ఉలవచారు లాంటి చిత్రాల్లో నటించింది. ఇలా నటిస్తున్న క్రమంలో లో ప్రముఖ సినిమా నటుడు అయిన మనోజ్ కె వివాహం చేసుకుంది 2001లో వీరికి ఒక కూతురు జన్మించింది. కొన్ని సంవత్సరాలు వీరి కాపురం సజావుగా జరిగినప్పటికీ ఆ తర్వాత విడాకులు తీసుకొని 2008లో రియల్ ఎస్టేట్ బిల్డర్ శివప్రసాద్ ను తిరిగి వివాహమాడింది. 2014లో వీరికి ఒక కొడుకు జన్మించాడు.

అయితే ఊర్వశి రెండో తమ్ముడు నందు ఒక శృంగార భరితమైన మలయాళ చిత్రంలో నటించడం జరిగింది. 1989 ఆర్.బి.చౌదరి నిర్మాణంలో, తులసీదాస్ దర్శకత్వంలో “లయనం” అనే చిత్రం విడుదల అయింది. ఇందులో నందు, సిల్క్ స్మిత, అభిలాష, దేవిశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇది శృంగార భరితమైన చిత్రం అయినప్పటికీ మలయాళంలో మంచి విజయాన్ని సాధించింది. నందు 17 సంవత్సరాలకే ఇలాంటి శృంగారభరితమైన చిత్రంలో నటించడం ఏమిటని అక్కయ్యలు కళారంజని, కల్పన, ఊర్వశి తమ్ముడు నందును నిలదీయడం జరిగింది. ఈ ముగ్గురు కెరీర్ మంచి పీక్ లో ఉన్నప్పుడు నందు ఇలా నటించడం వారు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత నందు అలాంటి చిత్రాల్లో నటించనప్పటికీ దాదాపు లయనం విడుదలైన పది సంవత్సరాలకి తన 26వ ఏట హీరో నందు చనిపోవడం ఆయన కుటుంబ సభ్యులని తీవ్ర విషాదం లోకి నెట్టింది. లయనం అనే మలయాళ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ సినిమాని తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కి అనువదించారు. ఇది సంగమం అనే పేరుతో తెలుగులోకి డబ్ కావడం జరిగింది.































