ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా ప్రపంచం మొత్తంలో ఏ విషయమైనా సరే నిమిషాల్లో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందిన కొన్ని విషయాలు మాత్రం అలా తెలియకుండా అలా ఉండి పోతాయి. అయితే ఆ తర్వాత ఏదో ఒక సమయంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అయితే ఇలా చాలా సినిమా వారి జీవితాలకు సంబంధించి మొదట బయటికి రాకపోయినా ఆ తర్వాత ఆ విషయాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న వారి నుండి ఏదో ఒక సమయంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అటువంటి జీవితానికి సంబంధించి హీరో చరణ్ రెడ్డి జీవితం దగ్గరగా ఉంటుంది.
ఈయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం చెందినవారని సమాచారం. 2001 సంవత్సరంలో రామోజీరావు కి సంబంధించిన ఉషాకిరణ్ మూవీస్ లో ఇష్టం అనే సినిమా ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో చరణ్ రెడ్డి మాత్రమే కాకుండా హీరోయిన్ శ్రియ శరణ్ కూడా వెండి తెరకు పరిచయం అయ్యింది. అంతే కాదు ఆ సినిమా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కూడా పరిచయమయ్యారు. ఈయన ఆ తర్వాత ఇష్క్, 24, మనం సినిమాలను నిర్మించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇష్టం సినిమా మాత్రం అసలు బాగా ఆడలేదు. దీంతో హీరో చరణ్ రెడ్డి సినిమాలలో నటించడం మానేశారు.
అయితే ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సుమంత్ సోదరి అయిన సుప్రియ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సుప్రియ కూడా పవన్ కళ్యాణ్ నటించిన మొట్ట మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తర్వాత సుప్రియ హీరోయిన్ గా నటించడం మానేసి ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో సంబంధించి వ్యవహారాలను చూడడం మొదలుపెట్టింది.
అయితే దురదృష్టవశాత్తు చరణ్ రెడ్డి కేవలం తన 36వ ఏటనే మరణించారు. అయితే ఆయన మరణించే సంవత్సరం తన భార్య సుప్రియ తో విడాకులు కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే మరణానంతరం ఆయన ను పరిశీలించిన వైద్యులు తీవ్ర గుండెనొప్పితో మరణించాడు అని తేల్చారు. గుండెనొప్పి రావడంతో హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు హాస్పిటల్ లోనే మరోసారి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో దాంతో డాక్టర్లు రక్షించలేక పోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయనకు ఫోరెన్సిక్ బృందం నిర్వహించిన పరీక్షలో ఆయన పూర్తిగా తాగుడుకు బానిస కావడం వల్లనే ఆయన లివర్ పాడవడం ద్వారానే ఆయన మరణించినట్లు తెలిపారు. అయితే ఆయన నటించిన ఇష్టం సినిమాకి డైరెక్టర్ విక్రమ్ తో పాటు రాజ్ కుమార్ కూడా సహాయ దర్శకుడిగా పని చేశారు.
అలా ఇష్టం సినిమాతో తన కెరీర్ నిర్మించుకున్న చరణ్ రెడ్డి ఆ తర్వాత కుటుంబ సమస్యల నేపథ్యం భాగంగా చివరికి తాను మందుకు బానిసైన అయి చివరికి మరణించడం జరిగింది. చరణ్ చనిపోయే వరకు ఎక్కడ తన అత్తగారింటి పేరును కానీ కాంటాక్ట్స్ ని కానీ వాడుకోకపోవడం వల్లనే ఆయనకు ఎక్కువగా అవకాశాలు రాలేదని అలాగే మీడియా కూడా అప్పట్లో పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదని నాగార్జునకు కొడుకు వరస అయినా కూడా అయన కూడా ఎక్కడ చరణ్ పేరును ప్రస్తావించకపోవడం నిజాన శోచనీయం. చరణ్ తోపాటు ఇష్టం సినిమా లో హీరోయిన్ గా నటించిన శ్రేయ శరణ్ మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో అగ్రతారల సరసన టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. ప్రస్తుతం ఆవిడ విదేశీయుడిని పెళ్లి చేసుకుని అక్కడే నివసిస్తున్నారు.
Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్ బర్త్డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రీ రిలీజ్..
Advertisement
దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్బాబు రీ రిలీజ్ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు.
Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.
Advertisement
బోయపాటి పైనే భారం.. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.
Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Advertisement
పాజిటివిటీని పెంచాలి.. చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.