2002 లో వచ్చిన నాగార్జున మూవీ మన్మథుడు గుర్తుంది కదా. ఆ సినిమా చూస్తే పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాల్సిందే. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు.. నవ్వులే నవ్వులు. ఫుల్ టు కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మన్మథుడు సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. నాగార్జున, సొనాలీ బిందె జంటగా నటించిన ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాకు కథను అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా డైరెక్టర్ విజయ భాస్కర్.
అయితే.. ఈ సినిమా ఒక జర్మనీ మూవీ కాపీ అని తాజాగా ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 1998లో జర్మనీలో వచ్చిన ఫోర్ ఫర్ వెనిస్ అనే మూవీ స్టోరీని బేస్ చేసుకొని ఈ సినిమా కథను రాశారు.. అనేది ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్త.
1998 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఫోర్ ఫర్ వెనిస్ ప్రదర్శన
Advertisement
1998 లో హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ఫోర్ ఫర్ వెనిస్(Four For Venice) ను ప్రదర్శించారు. ఆసమయంలో ఫారెన్ సినిమాలను చాలానే ప్రదర్శించారు. వందల సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కథ ఏంటంటే.. ఒక మొగుడు(లాయర్) , పెళ్లాం.. ఇద్దరూ బిజీనే. మొగుడు పెళ్లాన్ని అస్సలు పట్టించుకోడు. వారానికి ఒకసారి మాత్రమే భార్యతో గడుపుతుంటాడు. దీంతో.. అతడి భార్య.. ఓ పెయింటర్ తో అఫైర్ పెట్టుకుంటుంది. ఆ పెయింటర్ భార్యతో ఈ లాయర్ కు గొడవ జరుగుతుంది. తన భార్య.. పెయింటర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నదని తెలుసుకున్న లాయర్.. తనను మందలిస్తాడు. దీంతో పెయింటర్ తో కలిసి లాయర్ భార్య వెనిస్ కు పారిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న పెయింటర్ భార్య.. లాయర్ ను కిడ్నాప్ చేసి.. నీ భార్య.. నా భర్తను లేపుకుపోయింది.. పదా నా భర్తను వెతుకుదాం అని అతడిని వెంట పెట్టుకొని వెనిస్ వెళ్తుంది.
ఈ ప్రయాణంలో లాయర్ కు.. ఆమె మీద ప్రేమ కలుగుతుంది. అయితే.. లాయర్ కు నీళ్లంటే భయం. నీళ్లు ఉన్న వంతెన దాటాలన్నా భయం. కానీ.. చివరకు సినిమా క్లయిమాక్స్ లో షిప్ లో వెళ్తున్న తన దగ్గరికి వెళ్లడం కోసం నీళ్లలోకి దూకి తన దగ్గరికి చేరుకుంటాడు. చివరకు తన భార్యను వదిలేసి.. ఆ మహిళను పెళ్లి చేసుకుంటాడు.
మన్మథుడు సినిమాలో కూడా నాగార్జునకు నీళ్లంటే భయం
మన్మథుడు సినిమాలో కూడా నాగార్జునకు నీళ్లంటే భయం. పారిస్ వెళ్లినప్పుడు కూడా నీళ్లను చూసి భయపడతాడు. వంతెన దాటాలంటే భయపడతాడు. చివరకు క్లయిమాక్స్ లో హీరోయిన్ పెళ్లి అవుతుంటే.. షిప్ లో ఉంటే.. నీళ్లలో దూకి మరీ.. తన దగ్గరికి చేరుకొని తనను ప్రేమించే విషయం చెబుతాడు. అలా.. ఇద్దరూ ఒక్కటవుతారు. ఈ సినిమాలోని స్టోరీకి, ఫోర్ ఫర్ వెనిస్ సినిమాకు సంబంధం ఉంటుంది. అందుకే.. ఈ సినిమా ఇన్సిపిరేషన్ ఆ జర్మనీ మూవీ ఫోర్ ఫర్ వెనిస్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.