Connect with us

Featured

వామ్మో !! తండ్రిలాగా తయారవుతున్న ప్రభుదేవా.. ఎన్నో ప్రేమలు, మరెన్నో పెళ్లిళ్లు!!

Published

on

ప్రభుదేవా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఒక నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా, డాన్సర్ గా అందరికి సుపరిచితుడే. ఇన్ని టాలెంట్లు ఒక మనిషిలో ఉండడం చాలా అరుదు. అందుకేనేమో ప్రభుదేవను ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా అందరూ ఆరాధిస్తారు. కానీ ప్రభుదేవా మాత్రం ఆడవాళ్ళని ఆరాధిస్తూ ఉంటాడు. ఏంటి ప్రభుదేవా గురించి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి? అని అనుకుంటున్నారా.. అసలు ఎందుకు ఇలా అనవలిసి వచ్చిందో అన్న విషయాన్నీ తెలుసుకోవాలంటే ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.

అసలు ప్రభుదేవా తండ్రి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ప్రభుదేవా తండ్రి మరెవరో కాదు ప్రముఖ డాన్సర్ సుందరం మాస్టారు. అయితే సుందరం మాష్టారుకి ప్రభు దేవాతో పాటుగా మరో ఇద్దరు కుమారులు కూడా కలరు. అంటే సుందరం మాష్టారు ముగ్గురు బిడ్డలకు తండ్రి అన్నమాట. ప్రభుదేవా ఆయనకు పెద్ద కొడుకు. అయితే అప్పట్లో సుందరం మాస్టారు సినిమాల్లో బిజీ అయ్యాక భార్య పిల్లలను ఈరోజు పట్టించుకోలేదు. కట్టుకున్న భార్య ను చెన్నై లో కాపురం ఉంచి, అయన మాత్రం తమిళ్, కన్నడ, హిందీ అంటూ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు. ఈ నేపద్యంలోనే ఆయన తన తోటి డ్యాన్సర్ తో ప్రేమలో పడ్డాడు.

తనకు పెళ్లి అయింది, భార్య ఉంది అన్నా విషయాన్నీ మరిచిపోయి వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె మరెవరో కాదు ప్రముఖ లేడీ డాన్సర్ అయిన తార మాస్టర్. అయితే తార మాష్టార్ గురించి కూడా అందరికి బాగానే తెలుసు. అన్ని భాషల్లో కొరియోగ్రాఫేర్ గా చేసారు. ఆ తర్వాత కొన్ని డ్యాన్స్ షోస్ కి జడ్జిగా కూడా వ్యవరించారు. అంతేకాదు వీరి ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే అప్పట్లో వీరి రహస్య పెళ్లి తంతు తమిళనాట చర్యనీయాంశం అయ్యింది. మరి ఎందుకో తెలియదు గాని ఒకానొక సందర్భంలో తార మాస్టర్ సుందరం మాస్టర్ పై కేసు కూడా పెట్టారు. అప్పట్లో ఈ న్యూస్ పెద్ద దుమారాన్ని కూడా లేపింది. అయితే పెద్దకొడుకు ప్రభుదేవా కూడా తండ్రి బాటలోనే నడిచాడని చెప్పవచ్చు. తండ్రి సుందరం మాస్టర్ లాగాన కొడుకు ప్రభుదేవా సైతం తన తోటి డ్యాన్సర్ అయిన రామలతను ప్రేమించి 1995 లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ముగ్గురు పిల్లలు పుట్టాక కూడా భార్యతో కాకుండా, నయనతారతో ప్రేమాయణం నడిపాడు. నయన్ తో ప్రేమలో పడిన విషయం అందరికి తెలియడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో భార్యతో విడాకులు తీసుకున్నాడు.

అయితే ప్రభుదేవా ముగ్గురు పిల్లలు ఇప్పుడు బాగానే ఎదిగారు . భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత నయనతారని పెళ్లి చేసుకున్నాడా అంటే అదీలేదు. కొన్నాళ్ళ పాటు నయన్ తో ప్రేమ జీవితం గడిపాడు. ఒకానొక సమయంలో వీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. చివరికి పెళ్లి చేసుకోవడం కోసం క్రిస్టియన్ నుండి హిందూ మతం కూడా మార్చుకుంది నయన్. తీరా ఇద్దరు ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి విడిపోయారు. తండ్రీకొడుకులు ఇద్దరు కూడా తమతో జీవితాన్ని పంచుకుని, వారికి వారసుల్ని ఇచ్చిన భాగస్వామిని పెద్దగా ప్రేమించింది లేదు. ఇక ప్రభుదేవా సైతం అప్పుడు ఇప్పుడు ప్రేమ, పెళ్లి వంటి కొన్ని విషయాలతో వార్తల్లో ఎక్కుతూనే వచ్చాడు. అయితే గత కొంత కాలంగా తమ దగ్గరి బంధువుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ప్రభుదేవా గత సెప్టెంబర్లోనే రహస్యంగా మీడియా కంటికి చిక్కకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ముంబైలో కాపురం కూడా పెట్టాడు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా ప్రేమించే పెళ్లిచేసుకున్నాడట.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆ మధ్య ప్రభుదేవా విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక ఫిజియోథెరఫిస్ట్ అవసరం వచ్చిందట. ఆలా ఒక లేడీ డాక్టర్ ని నియమించుకున్నాడట. అయితే ఈ క్రమంలోనే ఆమె రోజు ప్రభుదేవా కి ఫిజియో థెరపీ చేయడానికి వాళ్ళింటికి వచ్చేది. ఇదే అదను చూసుకుని ప్రభుదేవాకి దగ్గర అయ్యిందట. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ పెళ్ళికి దారి తీసింది. వీరి పెళ్లి సైతం ముంబైలోనే జరిగినట్టు తెలుస్తుంది. వీరి వ్యవహారం మీడియా వాళ్ళకి తెలిసే లోపే పెళ్లి చేసుకుని, సైలెంట్ గా కాపురం పెట్టేసాడు. ఇదండీ అసలు సంగతి. అందుకనే ఈ కధనం మొదట్లో ప్రభుదేవా ఆడవాళ్ళని ఎంతగానో ఆరాధిస్తాడు అని అన్నది. అయితే ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తూ వారితో జీవితం పంచుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు. మరి ఈ కాపురం అయినా కలకాలం ఉండాలని ఆశిద్దాం. ఇక పోతే ప్రభుదేవా వ్యక్తిగత జీవితం ఎలా ఉన్న గాని, ప్రొఫెషనల్ గా మాత్రం వరస అవకాశాలతో దూసుకుపోతున్నాడు… !!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!