Connect with us

Featured

ఆ దర్శకులిద్దరి సినిమాలలో రాళ్ళపల్లికి ఓ పాత్ర ప్రాణం పోసుకోవాల్సిందే !

Published

on

కొంతమందిని చూస్తే ఇతను నటుడా.. అనే సందేహం కలగక మానదు. కానీ అతనే మొహానికి రంగేసుకున్నా.. ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే ఆ పాత్ర కామెడి, విలన్.. ఇలా ఎటివంటి పాత్ర అయినా విజృంభనే. అలాంటి గొప్ప నటులలో ఒకరు రాళ్ళపల్లి. ఆయన పోషించిన చాలా పాత్రలకి ప్రాణం పోశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో ఆగస్టు 15 1945లో పుట్టారు. బీకామ్‌ పూర్తి చేసిన రాళ్ళపల్లికి టెన్త్‌, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్స్‌తోనే రైల్వేలో క్లాస్‌ ఫోర్‌ జాబ్‌ అంటే ప్యూన్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 1970 ప్రారంభంలో ఢిల్లీలోని ‘సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌’ అనే ప్రభుత్వ సంస్థలోకి మారారు.

అప్పట్లో దాదాపు వెండితెర మీద వెలిగిన నటులలో ఎక్కువ శాతం నాటరంగంలో గొప్ప అనుభవం సంపాదించి వచ్చిన వారే. ఆ కోవలోనే రాళ్ళపల్లి కూడా వస్తారు. ఆయన కూడా పలు నాటకాలు వేసి గుర్తింపు తెచ్చుకొని సినిమా రంగంలో అడుగుపెట్టారు. రాళ్ళపల్లికి విపరీతంగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం. ఆయన చదువుకునే రోజుల్లోనే కాలేజీలో పోటీలు నిర్వహించారు. ఇందుకోసం రాళ్ళపల్లి ‘మారని సంసారం’ అనే నాటిక ఒకటి రాశారు. దీనికి రచన, నటన రెండు విభాగాలలోను అవార్డులు
దక్కాయి.

ప్రముఖ సినీనటి భానుమతి రామకృష్ణ చేతుల మీదుగా రాళ్ళపల్లి ఆ అవార్డులు అందుకున్నారు. నాటకమంటే ప్రాణమిచ్చే రాళ్ళపల్లి, అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రిహార్సల్‌ మొదలుపెట్టేవారు. ఆయన వేసే నాటకాలు సినిమా స్థాయిలో ఉండేవంటే నమ్మి తీరాల్సిందే. అంతేకాదు నాటకాల కోసం ఖర్చంతా ఆయనే పెట్టుకునేవారు. కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితుల్లో నాటకం కోసం అప్పులు కూడా చేశారు. అప్పుల నేపథ్యంలోనే ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాసి, దాదాపు వందకు పైగా ఆ నాటకాలను ప్రదర్శించి, వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకునేలా రూపొందించారు.

నాటక రంగంలో అంత సుధీర్ఘ అనుభవం సంపాదించిన రాళ్ళపల్లి తన భార్య సహకారంతో సినిమాలలోకి వచ్చారని చెప్పాలి. ప్రముఖ నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు పత్రికలో ఓ ప్రకటన చూసిన రాళ్ళపల్లి భార్య సినిమాలపై ఆయనకున్న ఆసక్తిని దృష్ఠిలో పెట్టుకొని దరఖాస్తు చేయమని సపోర్ట్ చేశారు. “చూడ్డానికి అందగాడిని కాకపోయినా నాకు నాటకాల్లో అనుభవం ఉంది. పనికొస్తే చూడండి” వినూత్నంగా అంటూ దరఖాస్తు పెట్టారు రాళ్ళపల్లి. అది చూసిన దర్శక, నిర్మాతలు ఆయనని ఇంటర్వ్యూకు పిలిచారు. సినిమాకు మాటల రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి, పాటల రచయిత సినారె సమక్షంలో ఒక సీన్‌ కెమెరా ముందు నటించి చూపించి ‘ఊరుమ్మడి బతుకులు’ అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు.

అయితే దీనికంటే ముందే రాళ్ళపల్లి 1973లో ‘స్త్రీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1977లో నటించిన ‘ఊరుమ్మడి బతుకులు’ పాపులారిటీ సాధించి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడలేదు. ముఖ్యంగా ఆయనలోని కమెడియన్ ని బయటకి తీసుకు వచ్చిన దర్శకులు, జంధ్యాల, వంశీ. వీరి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్నీ సినిమాలలో రాళ్ళపల్లికి ఓ పాత్ర ప్రాణం పోసుకునేది. ఆయనను నమ్మి దర్శకులు సృష్ఠించిన పాత్రలకి నిజంగానే ప్రాణం పోయడానికి తన శాయశక్తులా తాపత్రయపడేవారు. మణిరత్నం ‘బొంబాయి’ సినిమాలో హిజ్రాగా నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 15న కళాకారుల్లో ఒకరికి సన్మానం చేసి 50వేల రూపాయలు ఇచ్చేవారంటే కళల పట్ల, కళాకారుల పట్ల ఆయనకి ఉన్న గౌరవం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 850 కి పైగా చిత్రాలలో నటించిన రాళ్ళపల్లి చివరిగా నాని – మారుతి కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’ అనే చిత్రంలో నటించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!