Connect with us

Featured

చిన్నాకి నటనే రాదు ఆయనకు సినిమాలో అవకాశం ఇవ్వొద్దన్న డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా..??

Published

on

నెల్లూరు జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి (చిన్నా) సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ వెళ్లడం జరిగింది. అక్కడ 1986-87 మధ్యకాలంలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకొని తిరిగి చెన్నై వెళ్లిపోయారు. అవకాశాల కోసం ప్రతి దర్శకుని దగ్గరికి తన ఫోటో ఆల్బమ్ తో వెళ్ళారు. చాలా చోట్ల అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా మధుసూదన్ రావు దర్శకత్వంలో జయసుధ, శరత్ బాబు నటించిన ‘ఆత్మకథ’ చిత్రంలో చిన్న వేషం వేయడం జరిగింది.

అదే సమయంలో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అంకుశం సినిమాలో ఒక వేషం ధరించడం జరిగింది. ఆ సినిమాలో నటించే సమయంలో చిన్న చాలా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కున్నాడు. ఆ తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు అన్నపూర్ణ ఆఫీసులో ఎవరో కొత్త సినిమా నటీనటుల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పడంతో నటుడు చిన్న అక్కడికి వెళ్లారు. రాంగోపాల్ వర్మ, శివ నాగేశ్వరరావు ఇద్దరూ అక్కడే ఉన్నారు. నీకు నచ్చిన ఏదైనా ఒక సీన్ చేసి చూపించమని వారు అడిగారు.

అప్పుడు చిన్న యాక్ట్ చేసి చూపించడంతో.. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఏదో ఒక సీన్ బట్టి పట్టి చేసి చూపిస్తున్నాడు.. అంతేగాని ఆయనకు నటన రాదని, ఆయన శివ సినిమాలోకి తీసుకుంటే ఆ క్యారెక్టర్ ని చెడగొడతాడని నాగేశ్వరరావు, రాంగోపాల్ వర్మ కి చెప్పిన కూడా ఫైవ్ డేస్ తర్వాత హైదరాబాద్ వచ్చి తనను కలవమని చిన్నతో రాము అన్నాడు. రాంగోపాల్ వర్మ చెప్పినట్టుగానే ఫైవ్ డేస్ తర్వాత నటుడు చిన్నా హైదరాబాద్ వెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో రాముని కలవడం జరిగింది అలా.. చిన్నా పై కొన్ని వీడియో రిహార్సల్స్ చేయడం జరిగింది. అప్పుడు రాంగోపాల్ వర్మకి బాగా నచ్చడంతో నాగర్జున స్నేహితునిగా శివ సినిమాలో ఒక పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో వేసిన ఆ పాత్ర చిన్నాకి ఎంతగానో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘పుట్టింటి పట్టుచీర’ సినిమాలో యమున కి తమ్ముడిగా నటించే మంచి పాత్రను నటుడు చిన్న వేయడం జరిగింది.

Advertisement

అయితే శివ సినిమాలో చిన్నా బాగా చేయడంతో నాగేశ్వరరావు చిన్నాకి సారీ చెప్పడం జరిగింది. తాను రిజెక్ట్ చేసిన కొందరిలో సక్సెసైన ఒకే ఒకడివి నువ్వేనని చిన్నాని అభినందించడం జరిగింది. ఆ తర్వాత నటుడు చిన్నా ‘మనీ’ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని శివ నాగేశ్వరరావుకు ఇచ్చారు. ఆ తర్వాత మధురారానగరిలో, మనీ మనీ, ఆంటీ, అల్లరి పిల్ల లాంటి అనేక చిత్రాల్లో నటించి… ఈ మధ్యకాలంలో ఆ ఇంట్లో అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. నవ్విన నాపచేనే నవరత్నాలు పండించిందనడానికి చిన్నా సినీ జీవితమే ఒక చక్కటి ఉదాహరణ..!!

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!