Connect with us

Featured

ఐదేళ్ల కూతురితో చెన్నైకి చేరిన సంపత్ రాజ్..ఇప్పటికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.

Published

on

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు వారు ఇండస్ట్రీకి రాకముందే వారికి పెళ్లి అయినా సరే అవి దాచి పెట్టి సినిమాలు చేస్తూ బిజీ జీవితాన్ని గడిపారు. అలాంటి వారు ఎవరో ఒకసారి చూద్దాం.. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే అతని ఇమేజ్ ఎక్కడ పోతుందో అని చెప్పి ఆయనకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి చాలా రోజుల వరకు దాచాడు. అయితే ఎట్టకేలకు ఆ విషయం కొన్ని సినీ వర్గాల ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. కేవలం హీరోలు మాత్రమే కాకుండా ఈ లిస్టులో హీరోయిన్లు కూడా ఎందరో ఉన్నారు. వారు పెళ్లి అయింది అని చెబితే ఎక్కడ సినిమా ఆఫర్లు రావో అని ఆ విషయాన్ని దాచి పెట్టి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.

కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు కొందరు కమీడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పెళ్లి కాలేదని సినీ ఇండస్ట్రీలో కొనసాగిన వారు ఎందరో ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరుపొందిన పృథ్వి రాజ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతనికి పెళ్ళయిందని విషయాన్ని దాచి కొన్ని సినిమాల్లో నటించారు. ఈయనకు సినిమాల్లోకి రాకముందే విజయవాడకు చెందిన ఓ స్వీట్ షాప్ యజమాని కూతురు శ్రీలక్ష్మి తో వివాహం చేసుకున్నాడు. పృథ్వీరాజ్ మామ గారు చనిపోయిన ఆ స్వీట్ షాప్ ను తన భార్యతో కలిసి చూసుకునేవారు. కాకపోతే నటుడిగా బిజీ కావడంతో కుటుంబాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఆ తర్వాత సినిమాలలో మునిగిపోయి కుటుంబాన్ని ఆయన పట్టించుకోకపోవడంతో చివరికి ఆయన భార్య తన భర్త పై తనని తన పిల్లల్ని చూసుకోవడం లేదని విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ సమయంలో ఆయన సంపాదన బాగా ఉండడంతో ప్రతి నెల పెద్ద మొత్తంలో భరణం ఇవ్వాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ కుటుంబం కేసులకు సంబంధించి కొంత విచారణ జరిగిన తర్వాత చివరికి మళ్ళీ ఆయన అతని భార్యతో కలిసి పోయి ప్రస్తుతం హైదరాబాదులో జీవిస్తున్నారు.

తెలుగు, తమిళ సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ గా, విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి సంపత్ రాజ్. ఈయన కూడా సినిమా ఇండస్ట్రీకి రాక ముందే వివాహం జరిగింది. అయితే ఆ విషయాన్ని దాచి పెట్టి ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి రంగప్రవేశం చేశారు. ఈయన టాలీవుడ్ లో పంజా సినిమా ద్వారా రంగ ప్రవేశం చేశారు. తెలుగులోకి అడుగుపెట్టక ముందే ఆయన తమిళ ఇండస్ట్రీలో బాగా పేరు పొందాడు. తెలుగులో దమ్ము, మిర్చి, సోగ్గాడే చిన్నినాయన, శ్రీమంతుడు, రారండోయ్ వేడుక చూద్దాం.. లాంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కేవలం తెలుగు, తమిళ్ సినిమాల్లో మాత్రమే కాకుండా మిగతా బాషల సినిమాల్లో కూడా ఆయన నటించి మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో ఓ సారి ఆయన తన పెళ్లి విషయానికి సంబంధించి విషయాలను తెలియజేశాడు. ఇదివరకే తనకు వివాహం అయిందని అంతేకాకుండా తనకు పిల్లలు కూడా ఉన్నారని తేల్చి చెప్పాడు. తనకి 23 సంవత్సరాలు ఉన్న సమయంలోనే తన ఇంటి సభ్యులు సమక్షంలో 19 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిపాడు.

అయితే ఆ సమయంలో ఆవిడ అంతగా మానసికంగా ఎదగలేదని ఆవిడతో సంసారం చేయలేక, అంతేకాకుండా తనకు నటనపై ఉన్న ఇష్టంతో ఆవిడకు విడాకులు కూడా ఇచ్చానని తెలిపాడు. తను సినిమాల్లో నటించడానికి తన భార్య సహకారం లేకపోవడం కూడా ఎంతో బాధించిందని ఆయన తెలిపారు. తన భార్యకు విడాకులు ఇచ్చిన కానీ ఇప్పటికి కూడా తనతో ఓ మంచి స్నేహితుడుగా ఉంటాను అంటూ ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు తాను డబ్బులు ఇస్తాను అంటూ అసలు విషయాన్ని తెలిపారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆవిడ విడాకులు తీసుకోకుండా తనని నేను చంపేవాడిని అని లేకపోతే ఆవిడే నన్ను చంపేదని కూడా చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక పోతే సంపత్ రాజ్ కి మొదటి భార్యతో ఒక కూతురు కూడా ఉంది. భార్యకు విడాకులు ఇచ్చిన కూడా కూతురిని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు. అంతే కాదు తన కూతురు ఆలనా పాలన అన్ని తానే చూసుకుంటున్నాడు. కూతురు రెండవ తరగతి చదువుతున్న సమయంలో చెన్నై కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. ఇప్పటికి మల్లి పెళ్లి చేసుకోకుండా కూతురిని చదివిస్తూ సింగల్ పేరెంట్ గా మిగిలిపోయాడు సంపత్ రాజ్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!