ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించిన ఈయన పెరిగి పెద్దయ్యాక వ్యాపారాలపై ఎక్కువ మక్కువ చూపడం జరిగింది. వ్యవసాయం, రైస్ మిల్స్, బస్ ట్రాన్స్ పోర్ట్ లాంటి వ్యాపారాలు చేస్తూ ఉండగా…ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ‘నమ్మినబంటు’ సినిమా షూటింగ్ తమ సొంత ఊరు కారంచెడు లోనే జరుగుతుండగా డి.రామానాయుడు అక్కడికి వెళ్లారు. ఆ చిత్రాన్ని తమ ఊరివారు పైగా తమ బంధువులే నిర్మిస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కొన్ని వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పటికీ ఎందుకో సినిమాలో కొంత పెట్టుబడి పెట్టాలనుకున్నారు. అలా ‘నమ్మినబంటు’ చిత్ర నిర్మాతలను కలిసి తన కోరికను చెప్పడం జరిగింది. అప్పుడు రామానాయుడుది చిన్న వయసు కావున తక్కువ వాటాతో సినిమాల్లో పెట్టుబడి పెట్టమని సలహా ఇవ్వడం జరిగింది. అలా ‘నమ్మినబంటు’ చిత్రానికి రామానాయుడు కొంత పెట్టుబడి పెట్టారు.
ఆ క్రమంలో చిత్ర నిర్మాణానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం నటీనటులకు సంబంధించిన భోజన ఇత్యాది కార్యక్రమాలను చూడటం లాంటివి చేయడం జరిగింది. పైగా షూటింగ్లో వాడిన ఎద్దులను కూడా రామానాయుడు తన సొంతవే కావడం జరిగింది. ఆ తర్వాత రైస్ మిల్స్ పై ఇన్కమ్ టాక్స్ వారు రైడ్ చేయడం, రామానాయుడు కి నోటీసులు ఇవ్వడం లాంటివి జరిగాయి. వ్యవసాయం 100 ఎకరాలు ఉన్నప్పటికీ వాటిని ఎంత సాగుచేసిన పెద్దగా లాభాలు వచ్చేవి కావు. ఎవరో సలహా మేరకు తన పెదనాన్న మద్రాసులో ఉండడం వలన అక్కడికి వెళ్లి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాడు.ఆ క్రమంలో మద్రాసు ప్రయాణమై ‘అనురాగం’ అనే సినిమాలో 50వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ ఆ సినిమా పరాజయం చెందింది. తిరిగి కొత్త సినిమా ప్రారంభిద్దాం అంటే ‘అనురాగం’ చిత్ర నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రాలేదు.
ఆ క్రమంలో తన బంధువుల సహకారంతో 1963 లో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి తాపీ చాణక్య దర్శకత్వం లో ఎన్టీ రామారావు, జమున, విజయలక్ష్మి హీరోహీరోయిన్లుగా ‘రాముడు భీముడు’ అనే చిత్రాన్ని 1964 మే 21న చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సినిమా మొదటి రోజు నుండే హిట్ టాక్ రావడం జరిగింది. అలా తాను మొదటి సినిమాల్లో పెట్టుబడి పెట్టిన డబ్బులతో పాటు లాభాలు కూడా ‘రాముడు భీముడు’ అనే చిత్రం తీసుకు వచ్చింది. ఆ తర్వాత ప్రేమ్ నగర్, జీవనతరంగాలు, సోగ్గాడు, దేవత, అహ నా పెళ్ళంట హిందీలో మొదటగా దిల్ ఔర్ దీవర్, తోఫా, ప్రేమ్ నగర్ (హిందీ), తక్దీర్ వాలా… లాంటి హిందీ చిత్రాలే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతి, బెంగాలీ, ఒరియా, పంజాబీ, అస్సామీ, భోజ్ పురి లాంటి 13 భారతీయ భాషల్లో అనేక చిత్రాలను నిర్మించారు.
దాదాపు 130 చిత్రాలను నిర్మించినందుకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. 2006లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2012లో మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ తీసుకోవడం జరిగింది. 2015 ఫిబ్రవరి 18న డి. రామానాయుడు క్యాన్సర్ వ్యాధితో తుది శ్వాస విడిచారు. ఇప్పటికీ ఆయన సాధించిన రికార్డును ఎవరు కూడా అధికమించలేదు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.
గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Advertisement
జనసేనదే విజయమా.. ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.
AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.
ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.
Advertisement
పొత్తు ధర్మాన్ని పాటించండి.. ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
Advertisement
కూటమి అంటే కుట్రలు.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.