విశ్వ విఖ్యాత రచన సార్వభౌములు పరుచూరి సోదరులు. వారి మాటల తూట కోటను బద్దలు కొట్టే తుపాకియే వారి కలం. చలి చీమల తో సినీ పరిశ్రమ పై దండెత్తి ఖైదీ సినిమా తో చిరంజీవిని సినీ సార్వభౌముని గా శిఖరాగ్ర భాగాన ఆశీనులను చేసి… అదే మెగాస్టార్ తో రీ ఎంట్రీ గా ఖైదీ నెంబర్ 150 మూవీ కి పని చేయడం జరిగింది. పెన్ లో ఇంక్ ఆగిపోయిన మైండ్ లో థింక్ ఆగిపోలేదు. సినిమాలకు మాటలతో ముత్యాలనద్ధి తమ నటనతో సొభగులను దిద్ది సినిమా విజయానికి కారణం అయ్యేవారు.

ఇది కాదు ముగింపు, ఈ చరిత్ర ఏ సిరాతో,చలిచీమలు, మరో మలుపు..లాంటి సామాజిక సంస్కరణ చిత్రాలకు తమ రచనా సహకారాన్ని అందిస్తున్న క్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు ఓ సందర్భంలో రామకృష్ణ స్టూడియోలో పెద్దాయన రామారావు ను కలిసి మా తమ్ముడు గోపాల కృష్ణ మీ వీరాభిమాని మీకోసం రాసుకున్న మంచి కథ ఒకటి ఉందని చెప్పడంతో ఎన్టీ రామారావు అంగీకరించారు. అలా.. చండశాసనుడు సినిమాకి కథ, సంభాషణలు పరుచూరి బ్రదర్స్ అందించారు.

ఎన్టీరామారావు తన రాజకీయ చరమాంకంలో దేశభక్తి గల ఒక కథ కావాలని పరుచూరి బ్రదర్స్ కు చెప్పగా వారు ఒప్పుకున్నారు. అదే సమయంలో పెద్దాయనకు ఆరోగ్య సమస్య రావడంతో కథ రాయడం బ్రదర్స్ వాయిదా వేశారు. ఓ సందర్భంలో ఫంక్షన్లో ఎన్టీ రామారావు గారిని చూసిన పరుచూరి గోపాలకృష్ణ అలా వెళుతుంటే పెద్దాయన ఎన్టీఆర్… గోపాలకృష్ణ నడుంపై ఒక్కటిచ్చారు. ఏం బ్రదర్ మా కథ ఎంతవరకు వచ్చింది అని పెద్దాయన అనడంతో… దానిని సరదాగా తీసుకున్న గోపాలకృష్ణ రెండు రోజుల్లో మీకు కథ తయారు చేసి ఇస్తానన్నాడు. అలా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్ సినిమాగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.



























