చిన్నతనంలోనే బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న ఓ పిల్లవాడు మెల్లిగా తన కలానికి పని చెప్పాడు. ఆ వయసులో కొన్ని పాత్రలను కల్పించుకుని ఒక కథ రాశాడు. తన తండ్రి కూడా పుస్తకాల పురుగు కాబట్టి, ఆ పుస్తకాలను చదువుకోవడానికి తీస్తున్న క్రమంలో ఏదో పేపర్ లో నల్లటి గీతలతో రాసిన ఒక పేపర్స్ కట్ట కనబడింది. ఆ రాత పిల్లవాడి రాతల కనిపించింది. ఓహో ఇది ఖచ్చితంగా తన కొడుకే రాసి ఉంటాడని తండ్రి మొత్తం చదివాడు. అప్పటికీ ఆ వయసులో ఆ పిల్లాడు ఓ కథ రాయడం తండ్రికి ఆశ్చర్యం అనిపించింది. పాఠశాల సమయం పూర్తయిన తర్వాత సాయంత్రం పూట తమ థియేటర్ నుంచి ఊరూరా తిరిగి సినిమా అడ్వర్టైజ్మెంట్ చేసే ఓ రిక్షా తన స్కూల్ కి వచ్చేది. దానిని ఎక్కి తిరిగి థియేటర్ కి వెళ్లి, అక్కడ ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు వేసి తర్వాత ఇంటికి వెళ్ళేవాడు.
అలా తమ కొడుకు యొక్క ఆసక్తిని గమనించి తండ్రి డబ్బులు ఇవ్వడంతో పూరి జగన్నాథ్ 1989లో హైదరాబాదులోని ఫిలింనగర్ రావడం జరిగింది. అప్పుడే విడుదలైన శివ సినిమా విడుదల అవడం జరిగింది. ఈ సినిమా ఎవరు తీశారు?.. అని అన్వేషించాడు. అలా కృష్ణవంశీ పరిచయం కావడంతో రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణవంశీ, పూరిజగన్నాధ్ కు అవకాశం కల్పించాడు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ గులాబీ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ.. కృష్ణవంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకి పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడతా సినిమాకి పనిచేస్తున్న సమయంలో రవితేజతో నిన్ను హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తానని పూరి జగన్నాథ్ చెప్పారు. నువ్వు దర్శకుడు ఎప్పుడు అవుతావో.. నన్ను హీరోగా పెట్టి సినిమా ఎప్పుడు తీస్తావో.. అని రవితేజ ఒక మాట అన్నారు.
కొత్త దర్శకులకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తున్నాడని తెలిసి చోటా కె.నాయుడు సహాయంతో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకు బద్రి కథ చెప్పడం జరిగింది. ఆ కథకి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పడంతో..అప్పుడు పూరి జగన్నాథ్ ఎగిరి గంతేసాడు.ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో ఒక సూపర్ హిట్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. అలా పూరి జగన్నాథ్ మొదటి సినిమాగా త్రివిక్రమరావు నిర్మాణ సారథ్యంలో బద్రి సినిమా విడుదల అయ్యింది. ఇక అప్పటినుండి పూరి జగన్నాథ్ వెనుతిరిగి చూసుకోలేదు. అయితే ఈ సినిమా కంటే ముందే పూరి జగన్నాథ్ టీవీ సీరియల్స్ కి స్క్రిప్టు రాసేవాడు. కొన్ని మ్యాగజైన్స్ కి బొమ్మలు గీస్తూండేవాడు.
ఆ క్రమంలో ఐ.బి.కె మోహన్ పూరి జగన్నాథ్ ను గమనించి ఆయనతో ఒక సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆ క్రమంలో కృష్ణ గారిని సంప్రదించి కథ చెప్పడంతో ఆయన ఓకే అన్నారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్,కృష్ణ కాంబినేషన్ లో థిల్లాన అనే చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.కానీ బడ్జెట్ విషయంలో నిర్మాత వెనుకంజ వేయడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి కృష్ణ సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పోకిరి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.