Tollywood: కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాపుతోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో మరో సారి ప్రతి ఒక్కరు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా మొదటి రెండవ దశలో ఎంతోమంది సిని సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు.

అయితే ఈ రెండు దశల్లో కాకుండా ప్రస్తుతం సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీ వుడ్ పరిశ్రమలలో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇలా వరుసగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడటంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడినట్లుగా తెలిపారు. ముఖ్యంగా రెండు రోజుల వ్యవధిలో ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారికి గురైనట్లు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీరందరూ ఒక్కసారిగా మహమ్మారి బారిన పడటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
నూతన సంవత్సర వేడుకలే కారణమా….
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం పలువురు సెలబ్రిటీలు ఇతర దేశాలకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నూతన సంవత్సరం తర్వాత పలువురు కోవిడ్ బారిన పడగా, మరికొందరు మాత్రం నూతన సంవత్సర వేడుకల కోసం ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త హైదరాబాద్ నగర శివారులో నిర్వహించిన పార్టీలో పాల్గొన్నారని, ఈ పార్టీలో ఏ విధమైనటువంటి కరోనా నిబంధనలను పాటించకపోవడంతో వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందనే వార్తలు వినబడుతున్నాయి. మొత్తానికి నూతన సంవత్సర వేడుకలే వీరికి ఈ పరిస్థితి తీసుకు వచ్చాయా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.




























