బొమ్మ బ్లాక్ బస్టర్ కావాలంటే.. సినిమాలో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. అందుకే దర్శకుడు స్పెషల్ సాంగ్ కోసం స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు. అందులో భాగంగానే ప్రస్తుతం టాప్ హీరోయిన్లను పట్టుకొచ్చి ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ పాటలో సినిమాకు పిచ్చ క్రేజ్ తీసుకొస్తున్నారు. సినిమాను హిట్ చేయడంలో ఈ పాటలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఇయర్ లో కూడా పలు స్పెషల్ సాంగ్స్ సంచలనాలు కలిగించాయి. ఈ పాటల కోసం కొందరు హీరోయిన్లు ఐటెం గర్ల్స్ గా మారిపోయారు కూడా. 2021లో సత్తా చాటి ఐటెం సాంగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈ ఏడాది సంక్రాంతి బరిలో మూడు సినిమాలు నిలిచాయి. అందులో క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్ అదరగొట్టాయి.
క్రాక్ సినిమాలో భూమ్ బద్దల్
Advertisement
క్రాక్ సినిమాలో భూమ్ బద్దల్ అంటూ అప్సరా రాణి దుమ్మురేపింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవి తేజ హీరో గా నటించగా శ్రుతీ హాసన్ హీరోయిన్ గా నటించింది.
రెడ్ మూవీ లోని డించిక్ డించిక్ డింకా
అటు రెడ్ సినిమా కోసం ఐటెం గర్ల్ గా మారింది హెబ్బా పటేల్. డించిక్ డించిక్ అంటూ ఊపు ఊపింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో రామ్ హీరో గా నటించగా, నివేద పేతురేజ్ మెయిన్ లీడ్ గా నటించింది.
అల్లుడు అదుర్స్ లోని రంభ ఊర్వశి మేనక
ఇక అల్లుడు అదుర్స్ సినిమాలో చిట్టి పొట్టి బట్టలతో అందాలను బయటపెట్టి కుర్రోళ్ల మతి పోగొట్టింది మోనాల్ గజ్జర్. రంభ ఊర్వశి మేనక అంటూ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు నభ నటేష్ మెయిన్ లీడ్ లో నటించారు.
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలోని మందులోడా ఓరి మాయలోడా
Advertisement
అటు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలోని ఐటెం సాంగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. ఈ పాటలో స్నేహా గుప్తా మందులోడా ఓరి మాయలోడా పాత కోసం.. తన అందాల కనువిందు చేస్తూ సూపర్ స్టెప్పులతో అదరగొట్టింది. ఇక ఈ చిత్రంలో అజయ్, ఆనందిని మెయిన్ లీడ్ లో నటించారు.
సీటీమార్ సినిమాలో పెప్సీ ఆంటీ పాట కోసం తన ఒంపు సొంపులతో మరోసారి అదరగొట్టింది అప్సర రాణి. గోపీచంద్ హీరో గా, తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఈ ఐటెం సాంగ్ హైలెట్ గా నిలిచింది.
ఇక కెరీర్ లో తొలిసారి ఐటెం సాంగ్ చేసింది సమంతా. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊ అంటావా మామా అంటూ ఊపు ఊపేసింది. స్పెషల్ సాంగ్ లో ఊర మాస్ స్టెప్పులు వేసి జనాలను ఫిదా చేసింది. మొత్తంగా ఈ ఏడాది పలు ఐటెం సాంగ్స్ అదుర్స్ అనిపించాయి.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.