Connect with us

Featured

సుధీర్, హైపర్ ఆది లతో సహా ‘జబర్దస్త్’ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా.?!

Published

on

టాలీవుడ్ లోని హీరో, హీరోయిన్లు, బుల్లితెర యాంకర్ల రెమ్యునరేషన్ గురించి ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారి రెమ్యునరేషన్ వివరాలను ఎప్పటికప్పుడు రహస్యంగానే ఉంచుతారు కాబట్టి. అయితే ఎంత రహస్యంగా ఉంచుదామని ట్రై చేసినా.. ఏదోక రకంగా ఆ వివరాలు లీకవుతూనే ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే..

బుల్లితెరపై గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోలో కంటెస్టెంట్ల దగ్గర నుంచి జడ్జీల వరకు ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది సాధారణంగా అందరికీ వచ్చే డౌట్. తాజాగా ఆ షోకు జడ్జీ వ్యవహరిస్తున్న రోజాతో పాటు కమెడియన్ల రెమ్యునరేషన్‌ వివరాలు లీకయ్యాయి. ఆ వివరాలేమిటో మీరే చదివి తెలుసుకోండి. కరోనా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ ప్రారంభమైన ‘జబర్దస్త్’ షోను మెగా బ్రదర్ నాగబాబు వదిలి వెళ్లి పోవడంతో ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోలో ఉన్నవాళ్ళ పంట పండిందట. ఈటీవీలో హయ్యెస్ట్ TRP రేటింగ్ తో దూసుకెళ్తున్న  ‘జ‌బ‌ర్ద‌స్త్’ కామెడీ షోతో వంద‌లాది మంది నటీ, న‌టులు సినీరంగానికి పరిచయమయ్యారు. వారానికి 2 రోజులు అన్నీ మ‌రిచిపోయి ప్రేక్ష‌కుల‌ను హాయిగా నవ్విస్తోంది ఈ షో. ఈ షోతో బాగా పాపులరైన క‌మెడియ‌న్లు కూడా జీవితంలో సెటిలై పోయారు.

ఈ షోకు సంబంధించిమరో ట్విస్ట్ ఏమిటంటే.. మెగా బ్రదర్ నాగబాబు బయటికి వెళ్లిపోయిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ షోలో రెమ్యునరేషన్స్ కూడా భారీగా పెంచేసారట.

తాజాగా చేసిన మార్పుల ప్రకారం సినీ నటి రోజా ఒక్కో ఎపిసోడ్‌ కు కరోనా లాక్ డౌన్ ప్రకటించక ముందు వరకు 3 నుంచి 4 ల‌క్ష‌లు తీసుకునేదని, నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఈమెను ఆపడానికి  ఆమె రెమ్యునరేషన్ డబుల్ ఇవ్వాల్సి వస్తోందని తెలిసింది. సో.. ఈ లెక్కన నటి రోజా ఈ జబర్దస్త్ షో ద్వారా నెల‌కు 8ఎపిసోడ్లకు 30 ల‌క్షల వ‌ర‌కు సంపాదిస్తుందన్న టాక్ వినబడుతుంది.

ఇక  ర‌ష్మి, అన‌సూయలు ఎపిసోడ్‌కు కరోనా లాక్ డౌన్ ప్రకటించక ముందు వరకు 50 నుంచి 80 వేలు అందుకునే వాళ్ళని, ఇప్పుడు మాత్రం లక్ష దాటేసిందని సమాచారం. వీళ్ల నెల ఆదాయం ప్రస్తుత లెక్కల ప్రకారం 4 నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంది.

ఇక టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువగా నెలకు 4 లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా చ‌మ్మ‌క్ చంద్ర జీ తెలుగుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా మంచి హైప్ ఇచ్చారని అంటున్నారు.

అలాగే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్‌కు కూడా రెమ్యునరేషన్స్ భారీగా పెంచేసారట. గతంలో ఒక్కో ఎపిసోడ్‌కు 3 నుంచి 3.5 ల‌క్ష‌లు అందుకున్న సుధీర్, ఇప్పుడు 5 లక్షల వరకు పెరిగిందట. హైపర్ ఆది రేట్ కూడా 3 నుంచి 4.5 లక్షలకు పెరిగిందంటున్నారు.

సాఫ్ట్ వేర్ నుంచి వ‌చ్చిన అదిరే అభి 3 ల‌క్ష‌లు, జ‌బ‌ర్ద‌స్త్ క‌ట్ట‌ప్ప రాకెట్ రాఘ‌వ 3.5 ల‌క్ష‌లు, కిరాక్ ఆర్పీ 2.8 ల‌క్ష‌లు, భాస్క‌ర్ అండ్ టీం 2 ల‌క్ష‌లు, రైటర్ కమ్ యాక్టర్ రాంప్రసాద్ 3 లక్షలు, చ‌లాకీ చంటి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటున్నారట. ఇక సునామీ సుధాక‌ర్, ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కూడా ల‌క్ష‌ల్లోనే తీసుకుంటున్నట్లు తాజా సమాచారం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!