EBC Nestam: రాష్ట్రంలో వెనుకబడిన అగ్రవర్ణ పేద మహిళలకు జగన్ సర్కార్ శుభవార్తను తెలియజేసింది.ఈ క్రమంలోనే అగ్రవర్ణంలో పేద మహిళలకు చేయూత ఇవ్వడం కోసం ఆర్థికంగా జగన్ ప్రభుత్వం సహాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 25వ తేదీ నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

ఈ విధంగా ఈ పథకానికి అర్హులైన మహిళలందరికీ ఈనెల 25వ తేదీ నుంచి 15 వేల చొప్పున వారి ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. అయితే ఈ పథకానికి కాపు నేస్తం, వైయస్సార్ చేయూత, ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ మహిళలు అనర్హులుగా ప్రకటించారు.

కేవలం ఈబీసీ కి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుల అయిన మహిళకు ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు బుక్కు ఉండాలి. అలాగే గ్రామాల్లో అయితే నెలకు 10 వేల ఆదాయం మించకూడదు పట్టణాలలో 12 వేల ఆదాయం మించకూడదు.
ఈ పథకానికి వీరు అనర్హులు..
ఈ పథకానికి అర్హులు కావాలంటే అభ్యర్థికి మూడు ఎకరాల కన్నా మాగాణి తక్కువగా ఉండాలి అదే విధంగా 10 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు. ఇలా భూమి ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరికీ పెన్షన్ రాకూడదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.అదేవిధంగా ఫోర్ వీలర్ ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.





























