ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇదివరకే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్. ఇప్పుడు పేదలకు శుభవార్త అందిచారు. ఇటీవలే “పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి ఇందులో భాగంగా కృష్ణ, గుంటూరు జిల్లాలలోని అర్హులైన వారికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సిఆర్డీఏ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అర్హులైన పేదవారికి ఈ భూములను కేటాయించినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 54,307 మంది లబ్దిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు జీవోలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా నౌలురు, కృష్ణాయపాలేం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను అర్హులైన పేదలకు ఇవ్వనున్నట్టు తెలిపారు.





























