Jandhyala wife Annapurna : తెలుగు సినిమాకు కామెడీ అనగానే గుర్తొచ్చే పేరు జంధ్యాల. నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అంటూ ఆయన రాసిన డైలాగు ఇప్పటికీ ఫేమస్. ఇక ఆయన సినిమాల ద్వారా తెలుగులో ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాకుండా తెలుగులో ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల గారు పేరు. అందుకే ఆయనను హాస్య బ్రహ్మ అని అంటారు. ‘ముద్దమందారం’ సినిమాతో డైరెక్టర్ అయిన జంధ్యాల గారు సుమారు 50 సినిమాలకు డైరెక్షన్ చేసారు. 300 సినిమాలకు పైగా రచయితగా డైలాగులు రాసారు. ఇక ఆయన మరణించిన తరవాత ఆయన కుటుంబం ఎక్కడా కనబడలేదు. మొదటి సారి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన భార్య అన్నపూర్ణ గారు ఆయన గురించి ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

జంధ్యాల గారు ఎలా మరణించారంటే…
జంధ్యాల గారికి అప్పటికే మధుమేహవ్యాధి ఉండటంతో షుగర్ టెస్టు కోసం ఎప్పటిలాగే హాస్పిటల్ వెళ్లగా మళ్ళీ అసిస్టెంట్ వచ్చి అల్పాహారం తీసుకువెళ్ళాడు. అయితే డాక్టర్ రాలేదని రిపోర్ట్స్ వచ్చాక మాట్లాడి వస్తానని చెప్పిన ఆయన ఇక రాలేదని, మధ్యాహ్నం సమయంలో ఆయనకు సీరియస్ గా ఉందని ఫోన్ రావడంతో హాస్పిటల్ కి వెళ్లగా అయనకు గుండె నొప్పి వచ్చిందని చెప్పారు. అలా ఆయన దూరమయ్యారని అన్నపూర్ణ గారు తెలిపారు. ఇక జంధ్యాల గారి తల్లి గురించి చెబుతూ ఆమె ఒక ఐదేళ్ళ క్రితం మరణించారని 90 ఏళ్ళు దాటాక మరణించారని తెలిపారు. భర్త మరణించాక అత్తగారే ధైర్యం చెప్పి అండగా నిలబడ్డారని చెప్పారు అన్నపూర్ణ.

బాలు గారు ఇల్లు ఖాళీ చేయించి సహాయం చేసారు…
జంధ్యాల గారు మరణించాక కూడా ఇండస్ట్రీ నుండి కొంతమంది అలాగే అభిమానులు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతుంటారుంటూ చెప్పారు. ఇక బాలు గారు ఎపుడూ టచ్ లోనే ఉన్నారని ఆయన చివర్లో హాస్పిటల్ కి వెళ్లే నాలుగు రోజుల ముందు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలి అని అడిగితే వెంటనే మనిషిని పంపి నేను ఖాళీ చేయిస్తాను, స్టూడియోలో ఉంటే ఫోన్ మాట్లాడలేను మెసెజ్ చేయండి అని మాట్లాడారట. చెన్నై లో బాలు గారి ఇంటికి దగ్గర్లోనే జంధ్యాల గారి ఇల్లు ఉందట. ఇక ఆ తరువాత ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరడం, ఆయన మరణించడం జరిగింది అంటూ చివరి చూపుకు కూడా వెళ్లలేని పరిస్థితి అంటూ ఆయన గురించి తెలిపారు అన్నపూర్ణ గారు.

































