Jayasudha : మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో గ్లామర్ హీరోస్ లో సూపర్ స్టార్ కృష్ణ తరువాత హీరో శోభన్ బాబు అందం గురుంచి చాలా ఎక్కువ మంది హీరోయిన్స్ మాట్లాడుకునేవారు. ఫ్యామిలీ హీరో శోభన్ బాబు కెరీర్ లో చాలా డిసిప్లైన్ గా ఉండేవారు, అలానే శోభన్ బాబు మొదటి నుండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. తాను సంపాదించుకున్న ప్రతి రూపాయి వేస్ట్ చేయకుండా భూమి మీద పెట్టుబడి పెట్టేవారు. ఇక వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో, చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
ఇక అసలు విషయానికి వెళ్ళితే, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్ లో, సహజ నటి జయసుధ గ్లామర్ హీరో శోభన్ బాబు గురుంచి కొన్ని విషయాలు తెలిపారు. హీరో శోభన్ దగ్గర నుండి మీరు ఒక్క విషయం నేర్చుకోలేకపోయాను. ఇక నా సినీ కెరీర్ మాక్సిముమ్ ఎక్కువ సినిమాలు ఆయనతోనే చేసాను కానీ, ఒక్క విషయం మాత్రం ఆయనను ఫాలో అవ్వలేకపోయాను అది ఏమిటి అంటే సహజ నటి జయసుధ – హీరో శోభన్ బాబు ది హిట్ కాంబినేషన్, వీరిద్దరి హిట్ కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. అలానే హీరో శోభన్ బాబు సరసన హీరోయిన్ గా జయసుధ చాలా ఎక్కవ సినిమాలు చేసింది.
ఇక సినీ ఇండస్ట్రీ లో తాను సంపాదించిన డబ్బుని దేని మీద పెట్టుబడి పెట్టితే ఎక్కువ లాభం వస్తుంది అనే విషయంలో హీరో శోభన్ బాబు చాలా ముందు చూపుతో ఉండేవారు. ఇక శోభన్ బాబు తాను సంపాదించిన ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టేవారు. ఇక ఒకానొక సమయంలో ఒక షూటింగ్ నిమిత్తం హీరో శోభన్ బాబు – హీరోయిన్ జయసుధ ఒకే కారు లో ప్రయాణించే సమయంలో ” హీరో శోభన బాబు జయసుధ తో ఏమోయ్ నేను ఒకటి చూపిస్తాను ఇది చూడు అని దారి మధ్య లో ఉన్న ఖాళీ స్థలాన్ని చూపించేవారు, ఈ స్థలాన్ని చూపించి మీ నాన్న గారితో మాట్లాడి దీన్ని కొనుక్కో అని చెప్పేవారు.
ఆ తరువాత జయసుధ భర్త ఆ స్థలాన్ని చూసి ఈ స్థలాన్ని చూస్తే ఇక్కడంతా డంపింగ్ యార్డ్ లాగా ఉంది దీని మీద ఇన్వెస్ట్ చేయమంటున్నారు అని అంటే, చూడు ఇప్పుడు ఉన్న ఈ స్థలం ముందు రోజుల్లో చాలా బాగా ఒక మంచి ప్రదేశం లాగా మారిపోతుంది అని చెప్పేవారు, అప్పుడు ఆ మాటలను నేను పట్టించుకోలేదు ఇప్పుడు ఆ స్థలం కాస్త మద్రాస్ లో అందానగర్ గా ఈరోజున ఎన్నో కోట్లు పలుకుతుంది, ఒక పెద్ద మహానగరం లాగా మారిపాయింది. హీరో శోభన్ బాబు గారు నాకు భూమి మీద పెట్టుబడి పెట్టు అని సలహా ఇచ్చేవారు, కానీ ఈ ఒక్క విషయం లో మాత్రం నేను ఫాలో అవ్వలేకపోయాను అని తెలిపింది ..
అలానే ఇక ఇదే ఎపిసోడ్ లో హీరోయిన్ గా మీరు టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు సినిమాలు ఎందుకు ప్రొడ్యూస్ చేసి నష్టపోయారు అని అడగ్గా, అలానే మహానటి సావిత్రి కూడా సినిమాలు చేసి నష్టపోయింది కదా, మరి మీరు సావిత్రి సినిమాల్లో నష్టపోయిన విషయం తెలిసి మీరు ఎలా సినిమాలు నిర్మించి నష్టపోయారు అని జయసుధ ని ప్రశ్నించగా ? దానికి సమాధానముగా హీరోయిన్ జయసుధ నేను హీరోయిన్ సావిత్రి గారితో కొన్ని సినిమాల్లో నటించాను. అలానే సావిత్రి గారు ఆల్కహాల్ కి బానిస అయ్యారు అని తెలుసు కానీ, ఇలా సినిమాలు నిర్మించి నష్టపోయిన విషయం నాకు తెలియదు, లేకుంటే నేను కూడా సినిమాలను నిర్మించాలనే ఉద్దేశం నాకు ఉండేది కాదు అని తెలిపింది ..
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.