Connect with us

Featured

Journalist Prabhu : ఆస్కార్ కోసం 80 కోట్ల ఖర్చు… అవార్డు కన్నా ఆ డబ్బు ఎంత… క్లారిటీ ఇచ్చిన కార్తికేయ…: జర్నలిస్ట్ ప్రభు

Published

on

Journalist Prabhu : ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ అవార్డు వచ్చిందనే చర్చ కంటే అవార్డును రాజమౌళి కొన్నాడనే విషయం మీద ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఇలాంటి చర్చ పొరుగు రాష్ట్రం వాళ్ళు ఈర్ష్యతో చేసి ఉన్నా ఏమీ అనిపించదు కానీ మన తెలుగు వాళ్ళే ఇలాంటి చర్చను జరపడం విడ్డూరంగానూ ఒకింత బాధగానూ అనిపిస్తుంది. ఆస్కార్ అందుకోవడం ఒక గర్వకారణం అయితే అందుకు ప్రశంశించకపోయినా పర్వాలేదు కానీ అవార్డు ఎలా వచ్చింది, ఎంత డబ్బు పెట్టి అవార్డు కొన్నాడు వంటి చర్చలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల వాళ్ళు వారిలో ఎవరికైనా అవార్డు వస్తే ఇలానే కించపరుస్తారా అన్నది ప్రశ్న. ఇక ఈ ఇష్యూలో రాజమౌళి కొడుకు కార్తికేయ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఇష్యూ విశ్లేషణ అందించారు జర్నలిస్ట్ ప్రభు.

అన్ని కోట్ల ఖర్చు నిజమేనా…

ఆస్కార్ వేదిక మీద తెలుగు సినిమాకు తెలుగు పాటకు అవార్డు రావడం నిజానికి మనకు గర్వకారణం కానీ అది వదిలేసి అవార్డు కోసం రాజమౌళి 80 కోట్లు ఖర్చు చేశాడంటూ మాట్లాడటం బాగోలేదని ప్రభు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన ఇలాంటి చర్చలకు చెక్ పెడుతూ రాజమౌళి కొడుకు కార్తికేయ క్లారిటీ ఇచ్చారు. ఆస్కార్ వరకు మన పాట వెళ్ళడానికే ఖర్చు కచ్చితంగా అయింది అయితే అది 80 కోట్లు మాత్రమే కాదు ఒక అయిదారు కోట్లయితే ఖర్చు అయింది. అది కూడా ఆస్కార్ కి పంపినప్పుడు ఓటింగ్ కోసం ప్రపంచంలోని నలుమూలల ఉన్న కొంతమంది వ్యక్తులకు మన సినిమా చేరువ అవ్వాలి. అందుకోసం షోస్ వేయడం అలానే ఈవెంట్స్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది అందుకు ఖర్చు పెట్టాం.

Advertisement

కానీ ఆస్కార్ ను కొనలేశు దు అంటూ చెప్పారు. ఇక ప్రభు కార్తికేయ కామెంట్స్ మీద మాట్లాడుతూ కార్తికేయ క్లారిటీ ఇచ్చి మంచి పని చేసారు. లేకపోతే మనవాళ్లలో కొంతమంది అవగాహన రాహిత్యంతో ఆస్కార్ ను కొనుక్కోవచ్చు రాజమౌళి కొన్నాడు అనే భ్రమలో ఉండిపోతారు. కార్తికేయ ఇచ్చిన క్లారిటీ వల్ల కనీసం అర్థం అవుతుంది ఆస్కార్ కొంటే రాదు అని అంటూ చెప్పారు.

Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!