Kakarala Sathyanarayana : నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు సుమారు రెండుందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ విలనీజం. రెండింటిని పండించిన ఆయన బి, ఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన మా భూమి వంటి సినిమాల్లో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

రామలింగయ్య కులతత్వంను నమ్ముకున్నారు…
అల్లు రామలింగయ్య, కాకరల సత్యనారాయణ గారికి సీనియర్ అయినా రామలింగయ్య గారు కాకరల సత్యనారాయణ గారి గురువు రాజారావు గారికి సన్నిహితులు అలా వారిద్దరికి పరిచయం, సాన్నిహిత్యం ఉండేది. అయితే మొదట్లో అల్లు రామలింగయ్య గారికి రాజకీయా చైతన్యం ఎక్కువగా ఉండేది.

కానీ పోను పోను ఆయన తన పంథా మార్చుకుని కులతత్వానికి వెళ్లిపోయారు. ఆయన కులాన్ని కూడగట్టుకుని తరువాత సక్సెస్ అయ్యారు. అలాగే సినిమాలో అపుడే హీరో అవుతున్న చిరంజీవిని నిలబెట్టారు. ఆయన నమ్మిన కులతత్వం నాకు నచ్చలేదు. కానీ ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి మనం సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోవాలి అంటూ కాకరల అభిప్రాయపడ్డారు.
































