బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తనని పరోక్షంగా వేధిస్తోందని ఆమె అన్నారు. ఇటీవల పాస్పోర్ట్ విషయంలో కంగన చేదు అనుభవాన్ని చవి చూసిన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో ఆమె సోషల్మీడియా వేదికగా.. ‘మహారాష్ట్ర ప్రభుత్వం నన్ను మరోసారి పరోక్షంగా వేధింపులకు గురిచేస్తోంది. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి నాపై పెట్టిన కేసు కారణంగా నా పాస్పోర్ట్ పునరుద్ధరణకు అధికారులు తిరస్కరించారు. ఈ విషయమై హైకోర్టుకు వెళ్తే.. నా అప్లికేషన్ అస్పష్టంగా ఉందని పేర్కొంటూ జూన్ 25కి విచారణ వాయిదా వేసింది’ అని కంగన పేర్కొన్నారు.































