సాధారణంగా ఒక కల్యాణ మండపంలో ఒక వ్యక్తి ఒక అమ్మాయికి మాత్రమే తాళి కట్టి పెళ్లి చేసుకోవడం మనం ఇదివరకు చూశాం. ఒకవేళ వారి వివాహ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనల వల్ల వారిరువురు మరొక వివాహం చేసుకోవడం వంటి సంఘటనలను గురించి విన్నాము కానీ, ఒక వ్యక్తి ఓకే కల్యాణ మండపంలో ఓకే ముహూర్తంలో ఇద్దరినీ పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా చూశారా.. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని కొల్లార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..తిమ్మరవుతనహల్లి గ్రామంలోని వెగమడుగుకు చెందిన సుప్రియ, లలిత ఇద్దరు అక్కచెల్లెళ్ళు. అయితే ఈ అక్క చెల్లెలు ఇద్దరు దివ్యాంగులు. అక్క సుప్రియ మూగ కాగా, చెల్లెలు లలితకు చెవులు వినిపించవు. అయితే దివ్యాంగులు అయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను తమ వరసకు మావయ్యా అయినా ఉమాపతికి ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించారు.
ఈ క్రమంలోనే మే 7వ తేదీన తిమ్మరవుతనహల్లిలో వీరి వివాహం ఎంతో వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతూ తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.






























