పాఠశాలలు దేశంలోని చాలా రాష్ట్రాలలో మొదలు అయ్యాయి. ఉదయం పాఠశాలలకు విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు. ఇలా వాళ్లే స్కూల్ వద్ద వదిలి పెట్టి.. మళ్లీ సాయంత్రం వెళ్లి పిక్ అప్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ఓ ఇంట్లో పని ఎక్కువగా ఉండటంతో ఓ తల్లి తన పాపను పాఠశాల వద్ద దింపి రావడానికి ఆ పాపకు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని సహాయం అడిగింది.

అలాగే ఆ బాలికను తీసుకెళ్లిన అతడు.. దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మండ్య నగరంలో దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకు ఓ పాప ఉంది. పాఠశాలకు సమయం దగ్గర పడుతుండటంతో.. తనకు వేరే పని ఉందని.. పాపకు బాబాయ్ వరుస అయ్యే 32 ఏళ్ల సల్మాన్ ను సహాయం అడిగింది. అతడు అలాగే అని అక్కడ నుంచి తీసుకెళ్లాడు.
తన అన్న కూతురును పాఠశాలకు తీసుకెళ్లకుండా నేరుగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేశారు. సాయంత్రం ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ బాలికను చూసిన తల్లిదండ్రులు ముఖంపై గాయాలు ఉండటం గమనించారు. ఆ బాలికను గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. ఈ దారుణానికి పాల్పడింది బాబాయ్ అంటూ చెప్పింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని ఆరోజే అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్థానికంగా మహిళా సంఘం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలిన డిమాండ్ చేశారు.



























