Connect with us

Featured

Karthika Deepam: గుడిలోనే ప్రాణాలు వదిలిన వంటలక్క.. మోనితలాంటి వాళ్ళకి శిక్ష పడదా?

Published

on

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం బాగా ఆసక్తిగా మారింది. దీపను ఈసారి ఎలాగైనా చంపాలని మోనిత ప్లాన్ చేయడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు.

దీప నిద్ర లో నుంచి లేచి గుడిలో పూజ గురించి తన తండ్రి కూడా నమ్మకంగా చెప్పాడని గుడికి వెళ్దామని అనుకుంటుంది. వెంటనే వారణాసి కి ఫోన్ చేసి సిద్ధంగా ఉండమని చెబుతుంది.

మరోవైపు మోనిత రెడీ అవుతూ.. దీపను ఎలా చంపితే బాగుంటదని అని అనుకుంటుంది. తన చేతికి మట్టి అంటకుండా, అనుమానం రాకుండా ఉండాలని అనుకుంటుంది. గన్ చూసుకొని ఇది ఉన్నాక ఇంకెందుకు ప్లాన్ చేస్తున్న అని అనుకుంటుంది.

ఇక దీప.. కారులో బయలుదేరుతుండగా.. వారణాసి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. దీప పూజ గురించి చెప్పడంతో.. ఒకరితో ఏం పూజ అని అడుగుతాడు. దీప కూడా డాక్టర్ బాబు కోసం చేస్తున్నానని అంటుంది.

మోనిత కూడా కారులో బయలుదేరుతూ కార్తీక్ గురించి తలుచుకుంటుంది. ఈరోజు దీప ని ఎలాగైనా చంపాలి అని ప్లాన్ చేసుకుంటుంది.

అంజి, దుర్గా మార్నింగ్ జాగింగ్ లో బిజీగా ఉంటారు. ఎలాగైనా వారిద్దరూ దీపమ్మను కాపాడాలని అనుకుంటారు. అంజి.. దీపను ఎలాగైనా చంపాలని అనగా.. దుర్గా వద్దు అంటాడు.

మోనిత అంటే తనకు లవ్ అని సిగ్గు పడతాడు. వెంటనే అంజి షాక్ అవుతూ.. ఈ ప్రపంచంలో దాన్ని కూడా లవ్ చేసేవాడు ఉంటాడా అని అంటాడు. ఇక అక్కడ సీన్ మాత్రం బాగా ఫన్నీ గా సాగుతుంది.

వాళ్లు మోనిత గురించి మాట్లాడుకుంటున్న సమయంలో దీప కారు ఆగుతుంది. ఇక దీపను ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగేసరికి పూజ గురించి అసలు విషయం చెబుతుంది. ఇక మేము కూడా వస్తాము అనేసరికి దీప వద్దని చెబుతుంది.

ఇక ఇంట్లో సౌర్య.. సౌందర్య దగ్గరికి వచ్చి అమ్మ ఏదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. అంతేకాకుండా కోపంతో నానమ్మ పై అరుస్తోంది. రోషిణి పై మండిపడుతుంది. ఇక సౌందర్య కూడా దీప ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తుంది.

మోనిత.. కార్తీక్ గురించి ఆలోచిస్తూ.. దీపని చంపేస్తానను అనుకుంటుంది. దీపా అడ్డు తొలగిపోతే పిల్లలతో సంతోషంగా ఉందాము అని కార్తీక్ ని తలుచుకుంటూ మాట్లాడుకుంటుంది.

ఓ వైపు గుడిలో పూజారులు పూజా కార్యక్రమం గురించి ఏర్పాట్లు చేస్తుంటారు. అక్కడికి దీప చేరుకుంటుంది.మోనిత కూడా చేరుకోగా దీపను ఫాలో అవుతూనే ఉంటుంది. కారుని చూస్తూ నేను నా కార్తీక్ తిరిగిన కారు అని అనుకుంటుంది.

దీపా ఎక్కడికి వెళ్తే అక్కడికి తన వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఇక పూజారి దీపతో మాట్లాడుతుంటాడు. పూజ గురించి వివరిస్తాడు. మోనిత మాత్రం పక్కనే ఉండి అవన్నీ వింటుంది. ఇక దీప కూడా పూజకు సిద్ధం గా ఉంటుంది.

మోనిత తన వెంట తెచ్చుకున్న గన్ ను తీసి దీప వైపు గురి పెడుతుంది. దీప కార్తీక్ గురించి పూజారి తో మాట్లాడుతుంటుంది. ఇటువంటి పూజలు కార్తీక్ ను, నన్ను విడదీయవు అని అనుకుంటుంది.

ఇక సోదమ్మ తన తల్లిదండ్రులకు చెప్పిన విషయాన్ని చెబుతుంది దీప. దీప పూజకి సిద్ధమవ్వగా మోనిత తన గన్ తో షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇక చివరకు మోనిత.. దీప ని షూట్ చేయగా దీపా కింద పడిపోతుంది. ఇక ఆ తర్వాత దీప ప్రాణాలు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితిగా మారింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!