Connect with us

Featured

KCR : కర్ణాటక ఫలితాలు.. తెలంగాణలో మంటలు.. చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌కు ఊహించని షాక్..!

Published

on

KCR : కర్ణాటక ఎన్నికల ఫలితం రానే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. బీజేపీ పాతాళానికి పడిపోయింది. కింగ్ మేకర్ అవుతారనుకున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేక చతికల బడ్డారు. ఇక ఎన్నో రోజులుగా కర్ణాటక ఎన్నికల ఫలితం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన తెలంగాణకు ఆ తరుణం రానే వచ్చేసింది. ఈ ఎన్నికల ఫలితం.. ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన ఫీలింగ్ ఇచ్చింది. బీజేపీకి కర్ణాటక ఘోర పరాజయం అనేది తెలంగాణలో తీరని నష్టాన్ని కలిగించే అంశం. ఇక కాంగ్రెస్ పార్టీ బీభత్సంగా బూస్ట్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇది ఊహించని షాక్. ఈ పార్టీ కుమారస్వామిని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీలను శాసించాలని భావించింది. డామిట్.. కథ అడ్డం తిరిగింది. ఊహించని పరిణామంతో గులాబీ బాస్ దెబ్బకు కుదేలయ్యారు.

రాజకీయాలను శాసించాలనకున్నారు..

తెలంగాణ ఎన్నికలను శాసించాలనుకోవడం వరకూ ఓకే కానీ కర్ణాటకను కూడా శాసించాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది. కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాదు.. కాబట్టి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుంది. తబ్ ఖేలేంగే ఖేల్ అన్నట్టుగా సీఎం కేసీఆర్ ఉన్నారు. కింగ్ కాస్త కుదేల్ అయ్యారు. కనీసం కుమారస్వామి తన కొడుకు నిఖిల్ గౌడను సైతం గెలిపించుకోలేకపోయారు. ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో అయ్యింది. దారుణాతి దారుణ పరాజయం. నిన్న ఉదయం వరకూ ఫుల్ జోష్‌లో ఉన్న కుమారస్వామి ఫలితాల తర్వాత కంగుతిన్నారు. ఇక సీఎం కేసీఆర్.. కుమార స్వామిని అడ్డు పెట్టుకుని కర్ణాటక రాజకీయాలను శాసించాలనుకున్నారు. కానీ సీన్ రివర్స్. కాంగ్రెస్ పార్టీని అందుకోవాలంటే ప్రస్తుత తరుణంలో ఎవరి తరమూ కాదు. బీజేపీ, జేడీఎస్, స్వతంత్రులందరూ కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరు. ఇలాంటి తరుణంలో కుమారస్వామి కింగ్ మేకర్ ఆశలన్నీ గల్లంతయ్యాయి.

Advertisement
Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!
Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

మరింత బూస్ట్ ఇచ్చిన కర్ణాటక ఫలితాలు..

ఇక ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఈ తరుణంలో కర్ణాటక ఫలితాలు ఆ పార్టీకి మరింత బూస్ట్ ఇచ్చాయి. ఇక పార్టీ నేతలంతా కలహాలను పక్కనబెట్టి కలిసి ముందుకెళితే తెలంగాణలో కూడా విజయం ఖాయం. ఎలాగూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో సానుభూతి బీభత్సంగానే ఉంది. కేవలం కలహాల పార్టీ కావడంతో ఆ పార్టీని జనం దూరం పెట్టారు. అదే అంతా కలిసి వెళితే మాత్రం మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఈ విషయం తెలుసుకున్నారో ఏమో కానీ కాస్త అంతా కలిసి వస్తున్నారు. ఇక పార్టీ అధిష్టానం కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అన్నీ కలిసొస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అయినా ఆశ్చర్యం లేదు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు. మొత్తానికి అక్కడ దెబ్బ కొట్టి ఇక్కడ లబ్ధి పొందాలనుకున్న కేసీఆర్‌కు ఈ ఫలితం చెంపపెట్టేనని చెప్పాలి.

హిమాచల్‌ప్రదేశ్ తర్వాత కర్ణాటక ఇక తెలంగాణలో కూడా అదే ప్లాన్ అమలు చేస్తే..

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అక్కడి ప్రజానీకం అవసరాలను టార్గెట్ చేసి సక్సెస్ సాధించింది. ఆ తరువాత కర్ణాటకలోనూ అదే ప్లాన్‌ను రిపీట్ చేసింది. సక్సెస్ అయ్యింది. దాన్నే తెలంగాణలో కూడా అమలు చేస్తే సక్సెస్ అవడం ఖాయం. అదేంటేంటే.. జనాలకు అవసరమైన హామీలు ఇచ్చేసింది. పలు పథకాలను ప్రకటించి వాటిలో భాగంగా.. మెయిన్‌గా కరెంట్ బిల్లలు వాచిపోతున్న తరుణంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. గృహిణులకు నెలకు రూ.2000, నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3000, డిప్లమా పట్టాదారులకు నెలకు రూ.1500, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా నెలకు 10 కిలోల బియ్యం వంటి ఎన్నో హామీలకు కాంగ్రెస్ గుప్పించింది. పైగా నేతలంతా కలహాలను పక్కనబెట్టి కలిసికట్టుగా ముందుకెళ్లడం లాభించింది. ఇదే స్కెచ్‌ను తెలంగాణలో సైతం అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!