Mahesh Babu: పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన కీర్తి సురేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. మహేష్ బాబు తో షూటింగ్ అంటే ఎంతో సరదాగా ఉంటుందని కీర్తి సురేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక ఒక పాట షూటింగ్ సమయంలో మహేష్ బాబును తాను మూడు సార్లు కొట్టానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కీర్తిసురేష్ వెల్లడించారు. పాట షూటింగ్ లో భాగంగా తాను స్టెప్పులు మర్చిపోయానని ఇలా టైమింగ్ మిస్ కావడం వల్ల మహేష్ బాబుని రెండుసార్లు కొట్టానని కీర్తి సురేష్ వెల్లడించారు. ఈ విధంగా తనని కొట్టినందుకు మహేష్ బాబును క్షమాపణలు కూడా కోరానని ఈమె తెలియజేశారు.
భారీగా పెరిగిన అంచనాలు…
ఆ తర్వాత కూడా టైమింగ్ మిస్ కావడంతో మరోసారి తనని కొట్టానని,ఈ విధంగా మూడుసార్లు మహేష్ బాబు పై చేయి చేసుకున్నానని కీర్తి సురేష్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన ఈ వ్యాక్యాలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మరి మహేష్ బాబు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
































