ప్రస్తుతం సౌత్ లోనే మంచి పేరున్న హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్న హీరోయిన్ కాగా తొలి సినిమా నేను శైలజ తో ఆమెది గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. టాలీవుడ్ కి పరిచయమైన తొలి సినిమాతోనే కీర్తి సురేష్ సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత నేను లోకల్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టింది. ఈ రెండు హిట్ లతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది..ఇక ఈ సినిమా ల తర్వాత ఆమె ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏకంగా నేషనల్ అవార్డు వచ్చేసరికి కీర్తి సురేష్ కోసం ప్రతి హీరో వెయిట్ చేశాడు.
ఆమెతో సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి..స్టార్ హీరో లతో చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వారితో చేయకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమా లు చేయడం ఆమెకు పెద్ద మైనస్ గా మారాయని చెప్పొచ్చు.. అయితే ఆ సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మరింత మైనస్ గా మారాయి..
తాజగా సావిత్రి బయోపిక్ లాగే మరో హీరోయిన్ బయోపిక్ కి ఆమె ఒకే చెప్పినట్లు సమాచారం.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రావాల్సిన బయోపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే త్వరలో మరో సీనియర్ నటీమణి జమున బయోపిక్ కూడా తెరపైకి రానున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ఒక దర్శకుడు జమునతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.జమున, సావిత్రి అప్పట్లో మంచి స్నేహితులు కూడా. ఇక ప్రస్తుతం జమున బయోపిక్ కు సంబంధించిన చర్చలు మొదలయినట్లు సమాచారం. ఇక హీరోయిన్ ఆమె పాత్రకు న్యాయం చేయగల నటిమణులు ఎవరని అనుకుంటున్న సమయంలో మహానటి చేసిన కీర్తి సురేష్ పేరు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం.



























