Kiara Advani -Sidharth Malhotra: బాలీవుడ్ నటీనటులు కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం వీరి వివాహం పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

గత మూడు రోజుల నుంచి కియారా వివాహ వేడుకలను
రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలస్లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ఇక ఈమె పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే పెళ్లి పూర్తి అయిన అనంతరం నటి కియారా అద్వానీ తన పెళ్లి ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Kiara Advani -Sidharth Malhotra:మీ ఆశీస్సులు కావాలి…
ఇలా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఇప్పుడు మా పర్మినెంట్ బుకింగ్ పూర్తి అయింది అంటూ పెళ్లి ఫోటోలకు క్యాప్షన్ జోడించారు. ఇక కొత్త జీవితం ప్రారంభించబోతున్న తమకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ఈమె కోరుకున్నారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీరి పెళ్లి ఫోటోలు పై ఓ లుక్ వేసేయండి.





























