అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఎంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు.అందుకు గల కారణం నాగార్జున ఇద్దరు కొడుకులు నటించిన సినిమాలు ఈ ఏడాది వరుసగా విజయాలు సాధించడంతో అక్కినేని కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.చైతన్య లవ్ స్టోరీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అద్భుతమైన విజయాలు సాధించడంతో నాగార్జున జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస ఫ్లాపులతో ఎదుర్కోవడంతో అఖిల్ విషయంలో నాగార్జున తీవ్ర ఆందోళన చెందినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన నాలుగవ సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ ని నమ్మి అతని దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ కు అవకాశం ఇప్పించారు.
ఇలా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డులను సృష్టించడంతో అటు చిత్ర బృందం, ఇటు అక్కినేని కుటుంబం ఎంతో సంతోషంలో ఉన్నారు.
నాలుగు సంవత్సరాలుగా విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ విధమైనటువంటి విజయం దక్కడంతో అందుకు కారణమైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర బృందానికి నాగార్జున పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అఖిల్ తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇవ్వగా నాగార్జున కూడా సినిమా నిర్మాతలకు అలాగే మిగిలిన చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.





























