Kiran Abbavaram: తెలుగులో రాజావారు రాణివారు ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెబాస్టియన్ వంటి సినిమాల ద్వారా నటుడిగా పరిచయమయ్యారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఇక ఈయన వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ లాంచ్ చేశారు.
ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాను ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చానని..తానేమి స్టార్ హీరో కాదని ఈయన తెలియజేశారు అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే తనని ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలియజేశారు.
కొందరు ఉద్దేశపూర్వకంగానే నాపై ఇలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని తాను స్పందించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఈయన తెలిపారు. ఇక ఒక సినిమా టైటిల్ కార్డ్స్ లో తాను పవర్ స్టార్ అనే ట్యాగ్ వేయించుకోకపోయినా కొందరు ఎడిట్ చేసి పవర్ స్టార్ అనే ట్యాగ్ వేశారని, అయితే ఈ విషయం గురించి తనని చాలామంది ట్రోల్ చేశారంటూ కిరణ్ అబ్బవరం వెల్లడించారు.
ఈ విషయంపై ఎంతోమంది మెగా, పవన్ అభిమానులు తనని ఎందుకు ఈ ట్యాగ్ తగిలించుకున్నావు అంటూ ట్రోల్ చేశారని ఈ సందర్భంగా ఈయన ఇండస్ట్రీలో తనపై కొందరు సాధిస్తున్న కక్షపూరితమైన చర్యల గురించి బయటపెట్టారు. దీంతో కిరణ్ అబ్బవరం చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…