Kota Srinivas Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం వయసు పై పడటంతో సినిమాలకు దూరంగా ఉంటూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే పలు యూట్యూబ్ ఛానల్ లకు ఈయన ఇంటర్వ్యూలు సినిమా సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాలని ఎప్పుడూ ఎక్కడ బయట పెట్టలేదని తెలిపారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు రోజుకు మేము రెండు కోట్లు తీసుకుంటున్నామని బహిరంగంగా చెబుతున్నారు. అయినా ప్రస్తుత కాలంలో సినిమా ఎక్కడ ఉంది సినిమా మొత్తం సర్కస్ చేస్తూనే ఉన్నారు. చివరికి విషాద గీతాలకు కూడా డాన్సులు చేస్తున్నారని ఈయన తప్పు పట్టారు. ఇక స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ల గురించి కూడా ఈ సందర్భంగా కోట మాట్లాడారు.

Kota Srinivas Rao: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారా…
స్టార్ హీరోలు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారని తెలిపారు. బాత్రూం బ్రష్ దగ్గర నుంచి మొదలుకొని బంగారు నగల వరకు ప్రతి ఒక్కటినీ ప్రచారం చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారని ఇలా స్టార్ హీరోలు అందరూ ఇలా సంపాదించడంతో మిగిలిన వారికి ఎలా సంపాదన వస్తుంది అంటూ మండిపడ్డారు. అయితే కోట శ్రీనివాసరావు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఈయనపై మండిపడుతున్నారు.


































