Krishnam Raju: అలనాటి ప్రముఖ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో ఎంతోమంది సినీ ప్రముఖులు కృష్ణంరాజు పార్తివదేహాన్ని దర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి ప్రముఖులు కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కృష్ణంరాజు ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించాడు ఆ తర్వాత ప్రభాస్ తో కొంత సమయం చర్చించాడు.అయితే ఇక్కడే అల్లు ప్రవర్తన అందరికీ వింతగా అనిపించింది. కృష్ణంరాజు మృతి పట్ల అందరూ సంతాపం తెలియజేస్తూ బాధలో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆయన మృతదేహం వద్ద నవ్వుతూ కనిపించాడు. అంతే కాకుండా ప్రభాస్ తో మాట్లాడే సమయంలో కూడా అల్లు అర్జున్ మొహంలో నవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో నెటిజన్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు.
కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోవడంతో అందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు. అల్లు అర్జున్ మాత్రం ఆయన పార్థివ దేహం వద్ద ఇలా నవ్వుతూ కనిపించడంతో నెటిజన్స్ అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కృష్ణంరాజు లాంటి ఒక ఇండస్ట్రీ పెద్దను కోల్పోయాం అన్న బాధతో ఉండాల్సింది పోయి ఇలా నవ్వటం ఏంటి అని ఏకీపారేస్తున్నారు.
అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోని వెనకేసుకు వస్తూ అల్లు అర్జున్ మొహంలో నవ్వు లేదని అతని మొహం విషాదంలో ఉందని తమ అభిమానం నటుడికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఇదే అదునుగా భావించి తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…