Krishnam Raju : కృష్ణంరాజు.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజు కుటుంబం నుంచి వచ్చినా.. జమీందారు అయినా చాలా సామాన్యుడిలా ఉంటారు. అందరితోనూ కలిసిపోతారు. కానీ.. ఆయన్ను చూస్తే మాత్రం అందరూ భయపడిపోతారు. ఎందుకంటే.. ఆయన చూడటానికి గంభీరంగా ఉంటారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. ఆయన ఇప్పటి వరకు వందల సినిమాల్లో నటించారు. 1966 లో కృష్ణం రాజు సినిమా రంగంలో అడుగుపెట్టారు. చిలకా గోరింక అనే సినిమాతో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆయనకు నంది అవార్డులు, బెస్ట్ యాక్టర్ అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు బోలెడు వచ్చాయి. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1973 లో వచ్చిన జీవన తరంగాలు, 1974 లో వచ్చిన కృష్ణవేణి, 1976 లో వచ్చిన భక్త కన్నప్ప, 1977 లో వచ్చిన అమరదీపం, 1978 లో వచ్చిన సతీ సావిత్రి, 1978 లో వచ్చిన కటకటాల రుద్రయ్య, 1978 లో వచ్చిన మన ఊరి పాండవులు లాంటి సినిమాలు ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిలింస్ గా నిలిచాయి. ఆయన ఇప్పటి వరకు 183 సినిమాల్లో నటించారు.
రెబల్ స్టార్ బిరుదు అలా వచ్చింది?
Advertisement
ఆయన సినిమాలు నచ్చి ఆయన అభిమానులు ఆయనకు ముద్దుగా రెబల్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు. ఆ బిరుదే ఇప్పటికీ.. ప్రభాస్ కు కూడా వచ్చింది. తన పెదనాన్న నుంచే రెబల్ స్టార్ బిరుదను పొందరు ప్రభాస్. అయితే.. కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే బిరుదు రావడానికి కారణం.. ఆయన సినిమాల్లో కన్నెర్ర చేయడం, రెబల్ గా మాట్లాడటమేనట. కృష్ణం రాజే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను సినిమాల్లో కన్నెర్ర చేయడం.. కత్తందుకో జానకీ.. అంటూ సీరియస్ గా ముఖం పెట్టడం, గంభీరమైన వాయిస్ ఉండటంతో.. నాకు నా అభిమానులు.. రెబల్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు.. అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణంరాజు
కృష్ణంరాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాదు.. రాజకీయాల్లోనూ ఆయన రాణించారు. ముందు ఆయన బీజేపీలో చేరారు. కాకినాడ, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2009 లో మెగాస్టార్ చిరంజీవి స్టార్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే.. రాజమండ్రి నుంచి ఎంపీగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రజారాజ్యంలో చేరి చాలా పెద్ద తప్పు చేశా
బీజేపీ పార్టీ తర్వాత.. ప్రజారాజ్యంలో చేరి చాలా పెద్ద తప్పు చేశానని కృష్ణం రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యంలో నేను చేరి ఉండకూడదు. కానీ.. అప్పట్లో తొందరపడి.. ప్రజారాజ్యం పార్టీలో చేరా. నాకు నిజంగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని ఉంది కానీ.. అది కుదరలేదు. అందుకే.. రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నా.. అంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
నా సినిమా వారసుడు ప్రభాసే
Advertisement
నాకు కొడుకులు లేరు. నాకు కూతుళ్లే ఉన్నారు. అయితే.. నాకు సినిమాల్లో వారసుడు అంటే మాత్రం నా సోదరుడి కొడుకు ప్రభాస్ మాత్రమే. నాలో ఉన్న క్వాలిటీస్ చాలా ప్రభాస్ లో ఉన్నాయి. ప్రభాస్ చాలా గొప్ప హీరో అవుతాడు.. అంటూ ప్రభాస్ గురించి చెప్పుకొచ్చారు కృష్ణంరాజు.
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.
ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.
Advertisement
నాలుగైదు టేకులు.. నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.
ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.
Advertisement
ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.
చిన్న సినిమాలలో బాహుబలి.. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.